టాలీవుడ్ సూపర్ స్టార్  మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ప్రస్తుతం మహేష్ బాబు తన తరువాత సినిమా పై ఫోకస్ పెట్టారు.మహేష్ తన తరువాత సినిమాను  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు.ఫ్యాన్స్ ఈ సినిమాకోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ ను కూడా మార్చుకున్నారు.లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో మహేష్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. సినిమాను రాజమౌళి బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

సినిమా షూటింగ్ ప్రారంభం కు ముందు  ఓ స్పెషల్ ప్రెస్ మీట్ ను దర్శకుడు రాజమౌళి నిర్వహించనున్నారు.ఈ సినిమాకు ఇప్పటికే కథ కూడా పూర్తి అయిందని ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.అలాగే ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది.ఈ సినిమా షూటింగ్ కోసం ఏకంగా 20 లక్షలు వెచ్చించి వంట సామాగ్రి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. రాజమౌళి సినిమా అంటే ఎంతటి సెటప్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే షూటింగ్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఈ నేపద్యంలో వంట సామాగ్రిని అద్దెకు తీసుకురావడం కంటే నేరుగా కొనుగోలు చేస్తేనే బెటర్ అని భావించి కేఎల్ నారాయణ ప్రొడక్షన్ టీంకి ఆదేశాలు జారీ చేశారట. ప్రొడక్షన్ టీం ఏకంగా 20 లక్షలు ఖర్చు చేసి బెస్ట్ వంట సామాగ్రిని సెలెక్ట్ చేసి కొనుగోలు చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: