చెల్లాటిస్టుగా నివేదా థామస్ తన కెరీర్ ని ప్రారంభించి ప్రజెంట్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపును పొందింది. 2011లో విడుదలైన మలయాళ చిత్రంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇక తెలుగులో ఆమె మొదటి చిత్రం జెంటిల్మెన్. దర్శకుడు మోహనకృష్ణ ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేశాడు. నాని డ్యూయల్ రోల్ చేసిన జెంటిల్మెన్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక రెండో చిత్రం కూడా నానితో చేసింది ఈ బ్యూటీ. రొమాంటిక్ లవ్ అండ్ టైనర్ నిన్ను కోరి తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. దాంతో తెలుగులో నివేదాకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఏకంగా ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.


దర్శకుడు బాబీ డైరెక్షన్లో జై లవకుశ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నివేదా థామస్ చేసింది. అలా వరుసగా మూడు హెచ్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక నివేదా థామస్ కెరీర్లో చెప్పుకోదగా విజయాలే ఉన్నాయి. అయినా ఆమె స్టార్ కాలేకపోయింది. రెజీనా కసాండ్రా అండ్ నివేదా థామస్ ప్రధాన పాత్రలో శకినీ ఢాకీనీ టైటిల్తో ఓ చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో నివేదాకు అవకాశాలు తగ్గాయి. ఆమె బరువు పెరిగి షేప్ అవుట్ అయ్యారు. అసలే పొట్టిగా ఉండే నివేదా లావు కావడంతో దర్శక నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు. నాకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి తాజాగా ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది నివేదా. నిజంగా ఈమెకి పెళ్లయిందా అని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.


నిజానికి ఈ బ్యూటీ కి పెళ్లయింది నిజజీవితంలో కాదు సినిమాలో‌. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ " 35 చిన్న కథ కాదు ". ఈ చిత్రం టీజర్ విడుదలైంది. టీజర్ రిలీజ్ వేడుకలు పాల్గొన్న నివేదా మాట్లాడుతూ..నా పెళ్లి వార్తలు చూసి మా అమ్మ ఆశ్చర్య పోతుంది. నాకు తెలియకుండా నీకు పెళ్లి ఎప్పుడు అయింది అబ్బాయిని ఎవరు చూశారు అంటుంది. అవును నాకు పెళ్లయింది. ఇతనే నా భర్త వీళ్లే నా ఇద్దరూ పిల్లలు అని వేదిక మీద ఉన్న వారిని చూపించింది నివేద. ప్రెసెంట్ ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: