సమంత , నాగ చైతన్య హీరోగా రూపొందిన ఏం మాయ చేసావే అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించాడు. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈమెకు వరసగా తెలుగులో అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె చాలా తక్కువ కాలంలోనే అనేక విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళిపోయింది.

ఇకపోతే ఈమె స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయంలో సమంత తో పాటు కెరియర్ ను ముందుకు సాగిస్తున్న బ్యూటీ లు అయినటువంటి తమన్నా , కాజల్ అగర్వాల్ ఐటమ్ సాంగ్ లలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కానీ ఈమె మాత్రం ఆ సమయంలో ఐటెం సాంగ్స్ జోలికి పోలేదు. కేవలం సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేస్తూ వచ్చింది. స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన చాలా సంవత్సరాల తర్వాత ఈ బ్యూటీ పుష్ప పార్ట్ 1 మూవీ లో ఐటమ్ సాంగ్ లో నటించింది.

ఈ ఐటమ్ సాంగ్ కి అద్భుతమైన గుర్తింపు లభించింది. ఈమె నటించిన ఐటమ్ సాంగ్ కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు రావడంతో ఈమె వరస పెట్టి స్పెషల్ సాంగ్స్ లో నటిస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆమె మాత్రం పుష్ప పార్ట్ 1 మూవీ లో ఐటమ్ సాంగ్ తర్వాత మళ్లీ వాటి వైపు వెళ్లలేదు. ఇక ఈమె అలా చేయకపోవడానికి ప్రధాన కారణం ఎప్పుడు అలాంటి సాంగ్స్ చేస్తూ ఉంటే నటిగా పెద్దగా గుర్తింపు ఉండదు అని ఉద్దేశంతో ఈమె మళ్లీ స్పెషల్ సాంగ్స్ జోలికి వెళ్లడం లేదు అని తెలుస్తుంది. ఇకపోతే ఈమె ఆఖరుగా ఖుషి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: