Niharika NM: సోషల్ మీడియాలో తన కంటెంట్ తో ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న నిహారిక ఎన్ ఎం ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఏకంగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించబడే ఒక సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో కనిపించబోతుంది.తన పుట్టినరోజు సందర్భంగా, గీతా ఆర్ట్స్ సంస్థ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ తో ఆమెను టాలీవుడ్ కుటుంబంలోకి స్వాగతించింది.ఇక చెన్నైలో జన్మించి, బెంగళూరులో పెరిగిన నిహారిక చాప్మాన్ యూనివర్సిటీలో ఎంబిఏ పూర్తి చేసింది.చిన్నతనంలోనే నాటక కళలపై ఆసక్తి పెంచుకున్న నిహారిక, పదో తరగతిలో ఉన్నప్పుడే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ, తన అభిమానులను మైమరపించే కంటెంట్ ను సృష్టించి నిహారిక భారీగా అభిమానులని సంపాదించింది. ప్రస్తుతం 6 మిలియన్లకు పైగా ఫాలోవర్లు కలిగిన నిహారిక సోషల్ మీడియాలో వినోదంతో కూడిన మంచి సోషల్ కంటెంట్ తో గుర్తింపు పొందింది.వినోదంతో పాటు, నిహారిక తన కంటెంట్ ద్వారా ముఖ్యమైన సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడంలో కూడా ఎంతగానో కృషి చేస్తోంది. 


ఆమె విజయవంతమైన తన కెరీర్ ను చాప్మాన్ యూనివర్సిటీ లో ఒక స్టడీ గా అధ్యయనం చేస్తున్నారు.ఇక సోషల్ మీడియా నుండి టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న నిహారిక ఎన్ ఎం, తన అనుభవం, ప్రతిభ ఇంకా ఆకర్షణతో మంచి గుర్తింపును పొందుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వినోదంతో పాటు ప్రాముఖ్యతను పొందిన కంటెంట్ సృష్టించడం ఆమె విశేషం. ఈ క్రమంలో టాలీవుడ్ లో ఒక నటి గా తన ప్రయాణం విజయవంతం అవుతుందని ఎంతో నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. నిహారిక తన ప్రతిభ, కట్టిపడేసే వ్యక్తిత్వంతో టాలీవుడ్ లో ఒక సత్తా చాటుతుందని అనడంలో అనుమానమే లేదు.టాలీవుడ్ లో అడుగుపెట్టడం అది కూడా గీతా ఆర్ట్స్ వంటి ప్రఖ్యాత నిర్మాణ సంస్థతో తన మొదటి చిత్రం చేయడం ఆమెకు ఒక గొప్ప అవకాశం. ఈ మూవీలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వినోదంతో పాటు సందేశాత్మక కంటెంట్ సృష్టించడంలో నైపుణ్యం కలిగిన నిహారిక, సినిమాల్లో కూడా తన ప్రతిభను చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆమె ఫాలోవర్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: