తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ అతుల్య రవి సుపరిచితమే.. కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమాతో మొదటిసారి తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు. అయితే ఈ చిత్రం కంటే ముందు 2017 లో కాదల్ ఖాన్ కటూటే సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రెండు మూడు చిత్రాలలో నటించి పర్వాలేదు అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ.. అందం అభినయంతో ఆకట్టుకున్న అతుల్య రవి అంతగా అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంట్లో చోరీ జరిగినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం.



అతుల్య రవి తన తల్లి విజయలక్ష్మితో కలిసి కోయంబత్తూర్ లోని వాడవల్లి మారుతం ప్రాంతంలో నివసిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంట్లో పాస్పోర్ట్ తో పాటు రెండు వేల రూపాయలు దొంగతనం జరిగినట్లుగా తెలియజేసింది. ఇలా తరచూ జరుగుతుందని పోలీసులను ఆశ్రయించింది.. ఈ మేరకు పోలీస్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుని సైతం చేపట్టారు. ఇంట్లో పనిమనిషి ఈ చోరీకి పాల్పడినట్లుగా తెలియడంతో హీరోయిన్ అతుల్య రవి ఆశ్చర్యపోయింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పనిమనిషి పైన అనుమానం వ్యక్తం చేయడంతో ఆ మహిళను సైతం విచారించారు.


తన స్నేహితురాలి సిల్వర్ సుభాషినితో కలిసి హీరోయిన్ అతుల్య ఇంట్లో దొంగతనం చేశామని డబ్బుతో పాటు పాస్పోర్టు కూడా దొంగలించినట్లుగా తెలియజేశారు.. పనిమనిషితో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు సైతం వీరి వద్ద నుంచి కేవలం 1500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారట. కానీ హీరోయిన్ అతుల్య రవి పాస్పోర్టు ఎక్కడ దాచిపెట్టారు అనే విషయం మాత్రం తెలియజేయలేదు. అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. చాలామంది సెలబ్రిటీల ఇళ్లల్లో కూడా పని మనుషులే ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. అందుకే చాలామంది హీరోయిన్స్ భయపడుతూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: