తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో అనుదీప్ కేవీ ఒకరుఎం ఈయన పిట్ట గోడ అనే సినిమాతో దర్శకు డిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయింది. ఇక ఈ సినిమా గొప్ప విజయం సాధించకపోవడంతో అనుదీప్ కు కూడా ఈ సినిమా ద్వారా పెద్ద స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఇక ఆ తర్వాత కొంత ఎక్కువ సమయం గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు నవీన్ పోలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో జాతి రత్నాలు అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు.

మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అనుదీప్ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడు తమిళ సినీ పరిశ్రమంలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ తో ప్రిన్స్ అనే మూవీ ని తెరకెక్కించాడు. మంచి అంచనాలను నడుమ తెలుగు , తమిళ భాషలలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో మాత్రమే ఆకట్టుకుంది.

సినిమా తర్వాత ఈయన రవితేజ తో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఈ దర్శకుడు కొన్ని రోజుల క్రితమే రవితేజకు ఒక కథను వినిపించగా , అది ఆయనకు నచ్చకపోవడంతో ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. దానితో తాజాగా ఈ దర్శకుడు విశ్వక్ సేన్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అనుదీప్ , విశ్వక్ కి ఓ కథ వినిపించగా , ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే అనుదీప్ దర్శకత్వంలో నటించడానికి విశ్వక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: