నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్ జే సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ తర్వాత నాని "హిట్" సిరీస్ మూవీ లతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందబోయే హిట్ ది థర్డ్ కేస్ మూవీ లో హీరో గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమా కోసం శైలేష్ కొలను అత్యంత క్రేజ్ ఉన్న నటీనటులను తీసుకోవాలి అని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ లో విలన్ పాత్రలో దగ్గుపాటి రానా ను తీసుకోవాలి అని శైలేష్ అనుకుంటున్నట్లు ప్రస్తుతం అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక శైలేష్ కనుక రానా కు కథను వినిపించడం ఆ కథ ఆయనకు నచ్చి ఆయన ఈ సినిమాకు కనుక  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయితే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు పెరిగే అవకాశం ఉంటుంది.

మరి రానామూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే నాని హిట్ ది థర్డ్ కేస్ మూవీ తర్వాత శ్రీకాంత్ ఒడెలా దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే వీరి కాంబోలో దసరా అనే మూవీ రూపొంది మంచి విజయం అందుకుంది. ఇక ఈ దర్శకుడి పని తనం నచ్చడంతో నాని ఇతనికి మరో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: