టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ ప్రస్తుతం స్వయంభు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇకపోతే చాలా రోజుల క్రితమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో ఇండియా గేట్ అనే సినిమా అనౌన్స్ అయ్యింది. ఇక ఇన్ని రోజుల పాటు స్వయంభు సినిమా షూటింగ్ పైనే ఫోకస్ పెట్టిన నిఖిల్ తాజాగా ఈ మూవీ ని కూడా స్టార్ట్ చేసాడు. ఈ సినిమాకు భారీ బడ్జెట్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి దాదాపు 80 కోట్ల బడ్జెట్ కాబోతున్నట్లు సమాచారం.

ఇకపోతే నిఖిల్ పై ఇంత పెద్ద బడ్జెట్ అంటే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఓకే కానీ కాస్త యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఇంత మొత్తంలో కలెక్షన్లను వేనక్కు రప్పించడం అంటే కష్టం అవుతుంది అనే వాదన సినీ ప్రేమికుల్లో వస్తుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బడ్జెట్ గురించి ఈ మూవీ నిర్మాతలలో ఒకరు అయినటువంటి అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ ... సినిమా బడ్జెట్ ఇంత అని మేము ఇంకా ఏమి ప్రణాళిక వేసుకోలేదు. కాకపోతే సినిమాకు ఎంత అవసరమో అంత పెడతాం. అలాగే సినిమా క్వాలిటీగా రావడం కోసం కాస్త ఎక్కువ అయినా పర్లేదు అనే విషయాన్ని చెప్పవచ్చాడు.

ఇది ఇలా ఉంటే రామ్ చరణ్సినిమా నిర్మాణంలో భాగం కావడంతో ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుండే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే నిఖిల్ కూడా వరుసగా మంచి కథలను ఎంచుకుంటూ విజయాలను సాధిస్తూ ఉండడంతో ఈ మూవీ పై మరింతగా అంచనాలు పెరిగాయి. ఇక సినిమా కనుక మంచి హిట్ టాక్ తెచ్చుకున్నట్లు అయితే ఈ మూవీ కి 80 కోట్ల బడ్జెట్ పెట్టినా కూడా అది వెనక్కు తీసుకువచ్చే సత్తా నిఖిల్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: