మీడియం రేంజ్ హీరోలలో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న నాని ‘దసరా’ మూవీతో 100 కోట్ల హీరోగా మారిన విషయం అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో భారీ పాన్ ఇండియా మూవీని చేయడానికి నాని సిద్దపడుతున్నాడు. ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ మూవీలో నటించిన నాని ఆమూవీ విడుదల కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.



ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం నాని శ్రీకాంత్ ఓదెల తో త్వరలో పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం జరుపుకోబోతున్న మూవీకి 120 కోట్ల బడ్జెట్ కేటాయించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈవార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ప్రస్తుతం నానికి కొనసాగుతున్న మార్కెట్ ధియేటర్ ఓటీటీలు కలిపి చూసుకున్నా 120 కోట్లు కలక్షన్స్ రావడం అంటే సులువైన పని కాదని ప్రస్తుత పరిస్థితులలో నాని మూవీ పై ఈ స్థాయిలో ఖర్చు పెట్టడం సాహసం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.



దీనికితోడు నాని నుంచి రాబోతున్న ‘సరిపోదా శనివారం’ మూవీ బ్లాక్ బష్టర్ టాక్ తెచ్చుకుని ఆమూవీ కూడ 100 కోట్లకు పైగా కలెక్ట్ చేయగలిగినప్పుడు మాత్రమే నానీ పై శ్రీకాంత్ ఓదెల తీయబోయే మూవీ పై 120 కోట్ల పెట్టుబడి సాహసం అవ్వదని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈసారి నానీతో తీయబోయే మూవీ కథ కూడ ఇంటెన్స్ డ్రామా అని అంటున్నారు.



ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ మూవీ కథ అంతా సికింద్రాబాద్ పరిసరప్రాంతాలలో జరిగే విధంగా ఉంటుందని టాక్. అంతేకాదు ఈ మూవీ కథ 1980 ప్రాంతంలో జరిగిన ఒక యదార్థ సంఘటన జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తయారు చేశారాని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ఎంపికతో పాటు టెక్నికల్ విభాగానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు ఎంపిక కావలసి ఉంది అన్న వస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: