సాధారణంగా భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. ఇలా గొడవలు లేని సంసార బంధం ఉంటుందా అంటే లేదు అని చెప్పేస్తుంటారు పెద్దలు. అయితే కేవలం సామాన్యుల మధ్య మాత్రమే కాదు సెలబ్రిటీ కపుల్స్ మధ్య కూడా ఇలాంటి గొడవలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఒకరకంగా ఇలాంటి గొడవలు జరిగినప్పుడే భార్యాభర్తల బంధం మరింత బలపడుతుంది అని చెబుతూ ఉంటారు. ఇలా హీరో హీరోయిన్లు సైతం ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు పడ్డ సందర్భాలు చాలానే ఉంటాయి అని చెప్పాలి.



 కానీ సెలబ్రిటీలు పర్సనల్ విషయాలను బయటకు రాకుండా చూసుకుంటూ ఉంటారు. కాగా ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దంపతుల గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ అతని భార్య లక్ష్మీ ప్రణతి ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడికి వెళ్ళినా అతి చేయకుండా ఎంతో హుందాగా నడుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి  అయితే వీరిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత చూసి అభిమానులు కూడా తెగ మురిసిపోతూ ఉంటారు. అయితే ఇక వీరిద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఏమి చేస్తారు అన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 సాధారణంగా తారక్ తనకు కోపం వస్తే ఇక స్పాట్లోనే తన కోపాన్ని చూపిస్తూ ఉంటాడు. కానీ ఆ తర్వాత ప్రేమగా దగ్గర తీసుకుంటూ ఉంటాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి మాత్రం ఇక ఎన్టీఆర్ పై కోపం వచ్చిందంటే చాలు వెంటనే వెళ్లి ఇక తారక్ మూవీ చూస్తుందట. అదే తారక్ కెరీర్ను మలుపు తిప్పిన ఆది సినిమాను పెట్టుకొని చూస్తుందట. ఆమెకు మొదటి నుంచి తారక్ సినిమాలంటే ఎంతో ఇష్టమట.  ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ ఆవేశం ప్రేమ ఎమోషన్స్ అన్ని కనిపిస్తాయి. అందుకే లక్ష్మీ ప్రణతికి ఎప్పుడు కోపం వచ్చినా ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాను చూస్తుందట. అలా చేస్తే వెంటనే తారక్ పైన ఉన్న కోపం పోతుందట. ఇందుకు సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: