టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మైథాలజికల్ ఫిక్షన్ మూవీ కల్కి. ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లో అత్యద్భుతంగా ప్రసారం అవుతుంది ఈ సినిమా. అయితే విడుదల కంటే ముందే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా విడుదలై ఊహకందని విజయాన్ని అందుకుంది. భారీ కాసుల వర్షం కురిపిస్తోంది అయితే ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడే దీనికి సీక్వల్ కూడా ఉండబోతోంది అంటూ వెల్లడించారు. అంతేకాదు క్లైమాక్స్ లో దీనికి సంబంధించిన హింట్ కూడా ఇచ్చారు. దీంతో

 ఇప్పటినుండే సీక్వెల్ ఫై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా కల్కి పార్ట్ 2 పై స్పందించాడు డైరెక్టర్. కల్కి టు కి సంబంధించిన చాలా ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. అంతేకాదు కల్కి కథ మొత్తం కూడా సీక్వెల్ లోనే ఉండబోతోంది అంటూ ఇప్పటినుండే సీక్వెల్ పై భారీగా అంచనాలు పెంచేశాడు. ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ” సీక్వెల్‌కు సంబంధించి నెలరోజుల షూటింగ్‌ చేశాం. దానిలో 20 శాతం బెస్ట్‌గా వచ్చింది. ఇంకా ముఖ్యమైన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. వాటిని కొత్తగా

 ప్రారంభించాలి. ఈ సీక్వెల్‌లో కమల్‌ హాసన్‌, ప్రభాస్‌, అమితాబ్‌ మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలుంటాయి. అశ్వత్థామ, కర్ణుడు, యాస్కిన్‌ల మధ్య శక్తిమంతమైన ధనుస్సు కీలకం కానుంది” అని అన్నాడు. ఇక ఈ సినిమాకు వస్తోన్న ఆదరణపై నాగ్‌ అశ్విన్‌ సంతోషం వ్యక్తం చేశారు. 'ప్రేక్షకులు దీన్ని ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎంతోమంది ఆడియన్స్‌ ఒకసారి కంటే ఎక్కువసార్లు దీన్ని వీక్షిస్తున్నారు. సినిమా విజయం సాధించిందని చెప్పడానికి అదే సంకేతం' అంటూ ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాడు... మొత్తానికి కల్కి 2 పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మరి కల్కి ఎంత పెద్ద అయింది అంటే కల్కి టు ఇంకెంత పెద్ద హిట్ అవుతుందో అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు డార్లింగ్ ఫాన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: