ప్రముఖ దర్శకులు బాపు తెరకెక్కించిన రాధాగోపాలంలో నటించిన స్నేహ అంటే తెలుగు అభిమానులకు ఎంతో ఇష్టం. తన అందమైన చిరునవ్వుతో ఈ బాపు బొమ్మ ఎందరో యువకుల హృదయాలను కొల్లగొట్టింది. పద్ధతిగా పాత్రలు చేస్తూనే, అవసరమైతే గ్లామర్ పాత్రల్లోనూ ఆమె మెరిసింది. ఇలా 90వ దశకంలో ఎంతో మంది ఇష్టపడే హీరోయిన్లలో ఒకరిగా స్నేహ స్నేహ పేరొందింది. పెళ్లయ్యాక సహాయక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆమె అలరిస్తోంది. 2000వ దశకం ప్రారంభంలో తమిళం, తెలుగు సినిమాల్లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. సుసి గణేశన్ దర్శకత్వం వహించిన విషయ చిత్రం ద్వారా స్నేహ తన నటనా రంగ ప్రవేశం చేసింది. కానీ ఈ సినిమా విడుదల ఆలస్యమవడంతో మాధవన్ సరసన ఎన్నవలే స్నేహకు తొలి తమిళ చిత్రంగా నిలిచింది. ఇక స్నేహ 1981 అక్టోబర్ 12న జన్మించింది. ముంబైలోనూ, దుబాయ్‌లోనూ ఆమె బాల్యం గడిచింది. ఇక నటుడు ప్రసన్ననను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారిద్దరూ చెన్నైలో 2012 మే 11న పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు. కుటుంబంతో స్నేహ ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు.

తన కెరీర్‌లో తెలుగు, తమిళంలో ఆమె ఎన్నో అవకాశాలను దక్కించుకుంది. అగ్రహీరోల సరసన నటించింది. కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, విక్రమ్, ప్రశాంత్, శ్రీకాంత్, ధనుష్ లాంటి తమిళ హీరోలతో ఆమె జతకట్టింది. తెలుగులోనూ ఆమె రవితేజ, శ్రీకాంత్, తరుణ్ వంటి ఎందరో హీరోలతో కలిసి నటించింది. 2009లో అచ్చముండు సినిమాలో ప్రసన్నతో కలిసి నటించింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల అంగీకారంతో వారిద్దరూ ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ గోట్ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాకుండా పలు రియాల్టీ షోలకు జడ్జిగా ఆమె వ్యవహరిస్తోంది. తరచూ వాణిజ్య ప్రకటనల్లో కూడా ఆమె నటిస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్నేహ తరచూ ఫొటోషూట్‌లతో ఆకట్టుకుంటోంది. ఇటీవల ఆమె చేసిన ఫొటోషూట్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఓ డ్యాన్స్ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌తో కలిసి ఆమె చేసిన డ్యాన్స్‌కు ఇతర జడ్జిలు సైతం ఆశ్చర్యపోయారు. వావ్ అంటూ ఈలలు వేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: