నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ సోషల్ డ్రామా మూవీ 'కుబేర'. ఈ సినిమా ఇప్పుడు మోస్ట్ ఎవెయిటింగ్ పాన్-ఇండియన్ చిత్రాలలో ఒకటిగా ఉంది. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.హ్యాపీడేస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కుబేర సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేనితోపాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సైతం నటిస్తున్న విషయం తెలసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పుష్ప 2 తర్వాత నటిస్తోన్న మరో సినిమా కుబేర. నాగార్జున, ధనుష్ వంటి అగ్ర హీరోలు యాక్ట్ చేస్తున్న కుబేర మూవీ నుంచి రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అది ఈరోజు తాజాగా రష్మిక మందన్నా ఫస్ట్‌ లుక్ గ్లింప్స్‌ చేశారు. నిర్మానుష్యంగా ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిన రష్మిక గుంతలో పూడ్చిపెట్టిన ట్రాలీ బ్యాగ్‌ను బయటకు తీయగా.. డబ్బుతో నిండి ఉంది. ఇంతకీ రష్మిక ఆ బ్యాగ్‌ను ఎక్కడికి తీసుకెళ్లిందనేది సస్పెన్స్‌ నెలకొంది. ఈ చిత్రాన్ని ఏషియన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సునీల్ నారంగ్‌, పీ రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కుబేర ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.ఇటీవలే ధనుష్‌, నాగార్జున, రష్మిక టీం ముంబై షెడ్యూల్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. జుహూ బీచ్‌లో ధనుష్‌పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించగా.. ఈ విజువల్స్‌ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో కూడా ధనుష్‌, అక్కినేని నాగార్జున మధ్య వచ్చే యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు.ఇదిలా ఉంటే, రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కుబేర మాత్రమే కాకుండా రష్మిక మందన్నా పుష్ప 2 మూవీ కూడా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన కపుల్ రొమాంటిక్ సాంగ్ సూసేకి చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పటికీ ఈ పాట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్ అనే మరో చిత్రం చేస్తుంది. ఇది లేడి ఒరియెంటెడ్ ఫిల్మ్. తన కెరీర్‌లో మొదటి సారి లేడి ఒరియెంటెడ్ సినిమా చేస్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.

మరింత సమాచారం తెలుసుకోండి: