పాన్ వరల్డ్ మూవీ 'కల్కి 2898 ఏడీ'... యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి కబాలి, మహాన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. జూన్ 27 వ తేదీన విడుదలైన్ ఈ సినిమా ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు 8వ రోజు కూడా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి.


 ఏకంగా రూ. 20 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ఇలా ఇప్పటి వరకూ మొత్తం రూ. 363 కోట్ల షేర్ రాబట్టి విజయానికి బ్రేక్ ఈవెన్ కి చేరువగా వచ్చేసింది. ఇప్పటిదాకా 725 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది ఈ సినిమా.  హీరో ప్రభాస్ భైరవ పాత్రలో అదరగొట్టారు. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ బచ్చన్ మెరుపులు మెరిపించారు. ప్రభాస్-అమితాబ్ కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కల్కి మూవీకి హైలెట్ అని చెప్పాలి. ఇక కాంప్లెక్సిటీ ఉన్న పాత్రలో దీపికా పదుకొనె చాలా అద్భుతంగా నటించింది. ఇక కమల్ హాసన్ కనిపించింది తక్కువ సన్నివేశాల్లో అయినా ప్రభావం చూపారు.సీక్వెల్‌లో కమల్ హాసన్, ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌  మధ్య భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంటాయట. ఆ ఎపిసోడ్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల్ని ఖచ్చితంగా ఆకర్షిస్తాయట. ఆ సీన్స్ కి గూస్ బంప్స్ రావడం పక్కా అట. ఇండియన్ స్క్రీన్స్ పై ఇప్పటిదాకా అలాంటి యాక్షన్ ఎపిసోడ్ నమోదు కాలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: