టాలీవుడ్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ హీరో ఎవ‌రంటే వెంట‌నే గుర్తోచ్చేది పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్. గ‌తేడాది స‌లార్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ఇత‌డు.. లేటెస్ట్‌గా క‌ల్కి 2898 ఏడీతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ రెండు సినిమాల‌కు సీక్వెల్స్ రానున్నాయి. అయితే సినిమాల‌తో పాటు ప్ర‌భాస్ మ‌రో మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. టాలీవుడ్ డైరెక్ట‌ర్ భలే భ‌లే మొగాడివోయ్ ఫేమ్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ చేస్తున్న తాజా చిత్రం రాజా సాబ్(). ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీలో ప్ర‌భాస్ లేని కీలక స‌న్నివేశాల‌ను చిత్ర‌బృందం ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తుంది. అయితే క‌ల్కి మూవీ విడుద‌ల అయ్యి ప్ర‌భాస్ ఫ్రీ అవ్వ‌డంతో రాజా సాబ్ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్న‌ట్లు తెలుస్తుంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది.సంక్రాంతి సమయంలో ప్రభాస్ కటౌట్ కూడా ఒకదాన్ని రిలీజ్ చేశారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా హైదరాబాదులో జరుగుతుంది. హీరోయిన్స్ మీద ఈ షూటింగ్ ప్లాన్ చేశారు. త్వరలో ప్రభాస్ కూడా ఈ సెట్లో ఎంటర్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కానీ ఆ విషయం మీద పూర్తిగా క్లారిటీ లేదు. అయితే తాజాగా ఈ సినిమా యూనిట్ ఒక కీలకమైన ప్రకటన చేసింది. అదేంటంటే ఈ సినిమా ఆడిషన్ కి సంబంధించిన కొన్ని ఫేక్ న్యూస్ సర్కులేషన్ జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పుకొచ్చింది. అయితే అవన్నీ నిజం కాదని ఇలాంటి వాటిని ఎవరు ఎంకరేజ్ చేయొద్దని చెప్పుకొచ్చింది. సినిమాకి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా తామే అధికారికంగా రిలీజ్ చేస్తామని అప్పటివరకు బయట నుంచి వచ్చిన వార్తలను నమ్మాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమా ఒక హారర్ కామెడీ అనే ప్రచారం ముందు నుంచి జరుగుతోంది అయితే అది ఎంతవరకు నిజమవుతుందనే విషయం సినిమా రిలీజ్ అయితే గాని చెప్పలేం. ఏకంగా ఈ సినిమాలో ఐదు ఆరుగురు హీరోయిన్లు నటిస్తున్నారని ప్రచారం కూడా జరుగుతుంది కానీ అధికారిక ప్రకటన మాత్రం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: