తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటీమణులలో సమంత ఒకరు. ఈమె ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ తెలుగు సినిమాలలో నటించింది. అలాగే తమిళ్ సినిమాలలో కూడా నటించింది. ఇకపోతే హిందీలో ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా సమంతకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... కొన్ని రోజుల క్రితమే నటుడు మరియు రాజకీయ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ "జనసేన" పార్టీ నుండి పోటీలోకి దిగి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇక ఈ సారి ఎన్నికలలో తెలుగు దేశం , జనసేన , బీజేలుడు పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేశాయి. దీనితో పవన్ కళ్యాణ్ కు తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరికొన్ని కీలక మంత్రి పదవులను కూడా ఇచ్చాడు. ఇకపోతే సమంత , పవన్ కళ్యాణ్ ను కలవబోతున్నట్లు , కాకపోతే అది తన సొంత పని కోసం కాదు అని ఎంతో మంది చెట్లను అనవసరంగా నరుకుతున్నారు అని , అలా నరకకుండా ప్రజల్లో అవేర్నెస్ పెంచడం కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలి అని పవన్ కు సూచించడానికి ఆయనను కలవబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన అత్తారింటికి దారేది సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. వీరి జంటకు కూడా మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: