టాలీవుడ్ క్రేజీ నటిగా మారిన అనసూయ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటారు. సోషల్ మీడియాలో అనసూయ గురించి తరచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆమెకి సంబంధించిన ఏదో ఒక వ్యవహారం వివాదంగా మారడంతో నెటిజన్లు అనసూయని ట్రోల్ చేస్తుంటారు.కొంతకాలం పాటు అనసూయ బుల్లితెర నుంచి బ్రేక్ తీసుకుంది. సినిమా ఆఫర్స్ ఎక్కువ కావడంతో అనసూయ సడెన్ గా జబర్దస్త్ మానేసింది. దీనితో అంతా షాక్ అయ్యారు. ఇదిలా ఉండగా ఇటీవల అనసూయ మెరుపులా మళ్ళీ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే షోలో అనసూయ పాల్గొంటోంది. ఇటీవల లాంచింగ్ ఎపిసోడ్ లో అనసూయ శేఖర్ మాస్టర్ తో కలసి జాకెట్ విప్పేస్తూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈసారి అనసూయ, శేఖర్ మాస్టర్ లెక్చరర్స్ అవతారం ఎత్తారు. మిగిలిన వాళ్లంతా స్టూడెంట్స్ గా హంగామా చేస్తున్నారు. అనసూయ లాంటి అందమైన లెక్చరర్ వస్తే స్టూడెంట్ చిలిపి కామెంట్స్ చేయకుండా ఎలా ఉంటారు. మేడం రెడ్డు శారీతో పాటు మీరు కూడా అదిరిపోయారు అని ఒకడు కామెంట్స్ చేస్తాడు. దీనితో అనసూయ సిగ్గు పడుతూ కనిపిస్తోంది. బెండకాయ, దొండ కాయ.. అనసూయ మేడం నా గుండెకాయ అని మరొకడు కామెంట్స్ వర్షం కురిపించారు. హోస్ట్ గా చేస్తున్న శ్రీముఖి గత ఎపిసోడ్ అనుభవాలని గుర్తు చేసే ప్రయత్నం చేసింది. వీళ్ళ సంభాషణ చూస్తుంటే జరుగుతున్న ట్రోలింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నారు. చీప్ పబ్లిసిటీ కోసమే ఇందంతా చేస్తున్నారు అనే కామెంట్స్ ఎక్కువవుతున్నాయి. శేఖర్ మాస్టర్ లాంచ్ రెస్పాన్స్ ఎలా వుంది.. మీ ఇంట్లో ఏమైనా ఇబ్బంది జరిగిందా అంటూ ఫన్నీగా శ్రీముఖి ప్రశ్నించింది. ఇక అనసూయ ట్రోలింగ్ ఎదుర్కోవడం.. ట్రోలర్స్ కి ఆమె సోషల్ మీడియాలో రిప్లై ఇవ్వడం చూశాం. శ్రీముఖి దీని గురించి పరోక్షంగా.. అనసూయ మీరు ఫోన్ తో బాగా బిజీగా ఉన్నట్లు ఉన్నారు అని అడిగింది. దీనికి కూడా అనసూయ సిగ్గుపడిపోయింది. అదే విధంగా అర్జున్ అంబటి, ప్రియాంక, విష్ణుప్రియ, రీతూ చౌదరి కూడా బాగా హంగామా చేశారు. అర్జున్ అంబటి అయితే ప్రియాంకని నడుము పట్టుకుని పైకెత్తుకున్నాడు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: