‘హీరామండి ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ బ్యూటీ శృతి శర్మ కీలకపాత్ర పోషించింది. తన నటనకు గాను ప్రశంసలు దక్కించుకుంటోంది. సైమా పాత్ర లో ఒదిగిపోయి నటించింది. షాహీ మహల్ వంటశాలలలో పని చేయడంతో పాటు అలామ్‌జేబ్‌కు నమ్మకమైన స్నేహితురాలిగా ఉంటుంది. ఈ సిరీస్ లో సైమా (శ్రుతి శర్మ) ఇక్బాల్ (రజత్ కౌల్)తో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె రొమాంటిక్ సీన్స్ పై కీలక విషయాలు వెల్లడించింది.ఇప్పటికీ సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్‏కు దూరంగానే ఉంటున్నారు. లిప్ లాక్, కిస్ నుంచి గ్లామరస్ రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఈ కారణంగానే ఎంతో మంది తారలు ఆఫర్స్ కోల్పోతున్నారు. అందం, టాలెంట్ ఉన్నప్పటికీ అలాంటి సీన్స్ చేయడానికి అంగీకరించకపోవడంతో సినిమాలు లేక ఖాళీగా ఉంటున్నారు. ఇక హీరామండి సినిమాలో ఇంటిమసీ సీన్స్ చేయనంత వరకు తన పరిస్థితి కూడా ఇంతే అంటూ తాజాగా కుండబద్దలు కొట్టారు శ్రుతి శర్మ.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. హీరామండి ముందు వరకు తనకు రొమాంటిక్ సీన్స్ చేయడం, స్క్రీన్ పై ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేదని చెప్పారు. ఎప్పటికీ తాను స్క్రీన్ పై రొమాన్స్ సీన్ చేయనని.. అందుకే ఎన్నో ప్రాజెక్ట్స్ వదులుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే హీరామండి తర్వాత తన నిర్ణయం మార్చుకున్నట్టు చెప్పుకొచ్చారు ఈమె.హిరామండి కంటే ముందు వరకు తెరపై ముద్దు సన్నివేశాలు చేయడం తనకు ఇష్టం లేదని చెప్పింది. రొమాంటిక్ సన్నివేశాలను తెరపై ఎప్పుడూ చేయకూడదనే అనుకున్నాను.. కానీ, ఇలాగే చాలా ప్రాజెక్ట్స్ కోల్పోయాను.. ఇక్కడ ఎంత గొప్పగా అందాలు చూపిస్తే అంత త్వరగా అవకాశాలు అంటూ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: