జక్కన్న డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా వచ్చే మూవీ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకోగా.. మహేష్ లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది. ఇక జక్కన్న సైతం త్రిబుల్ ఆర్ అనంతరం తగినంత సమయం తీసుకున్నాడు. అనంతరం ఈ ప్రాజెక్టుని డిజైన్ చేసుకున్నాడు. మహేష్ బాబు మినహా మిగిలిన ఏ ఆర్టిస్టు నీ ఇప్పటివరకు ఫైనల్ చేయలేదు జక్కన్న. పృధ్విరాజ్ సుకుమారన్ ఒకే ఒక పాత్రలో కనిపిస్తాడని సమాచారం వినిపిస్తుంది.

దీనిపై చిత్ర బృందం ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కనీసం స్పందించలేదు కూడా. ఇక ఈ మూవీ కోసం ఇండోనేషియా నుంచి చెస్లా అనే హీరోయిన్ ని రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. దాదాపు కథను అండ్ కథనాలను ఫిక్స్ చేశాడట జక్కన్న . ఇక ఇప్పుడు ఈ మూవీలో విలన్ పాత్ర కోసం విక్రమ్ ని సంప్రదించినట్లు టాక్ వినిపిస్తుంది. చిన్న పాత్ర అయినా అందులో స్టార్డం ని మిక్స్ చేయడానికి రాజమౌళి ఇష్టపడతాడు . విలన్ పాత్ర కోసం కూడా ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు.


ఇప్పుడు ఆయన దృష్టి విక్రంపై పడింది . జక్కన్న నుంచి ఆఫర్ రాగానే ఎంత పెద్ద స్టార్ అయినా ఒప్పుకోవాల్సిందే . ఆయన స్థాయి అలాంటిది మరి . విక్రమ్ ఈ ఆఫర్కు నో చెప్పే అవకాశం లేదు . సో మహేష్ కు విలన్ గా విక్రమ్ దాదాపుగా సెట్ అయిపోయినట్లే . ఈ ఏడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కనుంది . 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది . ఈలోగా మహేష్ మరో సినిమా చెయ్యడు . కనీసం కమర్షియల్ యాడ్స్ లో కూడా కనిపించడు . మహేష్ లుక్ రివిల్ కాకూడదన్న ఉద్దేశంతోనే జక్కన్న ఈ కండిషన్ విధించినట్లు తెలుస్తుంది.  ఏదేమైనాప్పటికీ జక్కన్న సినిమాపై మంచి కసర అప్పులు చేస్తున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: