సినీ పరిశ్రమలో ఒకరితో అనుకున్న సినిమాను మరొకరితో తెరకెక్కించడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా కథగా అనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ తో బాగుంటుంది అనుకున్న ఓ సినిమాను మహేష్ బాబుతో తెరకెక్కించారు. ఆ సినిమా ఏది..? అనే వివరాలను తెలుసుకుందాం? విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో అంజలి , సమంత హీరోయిన్లుగా మిక్కీ జే మేయర్ సంగీత సారధ్యంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించగా ... ప్రకాష్ రాజ్ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు మొదట పవన్ కళ్యాణ్ అనుకున్నారు. మరి ఆ తర్వాత మహేష్ బాబును ఎందుకు తీసుకున్నారు అనే విషయాలను ఓ ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు చెప్పుకొచ్చాడు.  ఆయన తాజా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... శ్రీకాంత్ అడ్డాల మా బ్యానర్లో కొత్త బంగారు లోకం సినిమా చేశాడు. ఆ మూవీ చాలా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఆయన నాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు సంబంధించిన చిన్న లైన్ చెప్పాడు. అది నాకు బాగా నచ్చింది. ఇక ఆయనతో ఎవరితో చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాను. ఆయన అంత కొత్త వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు.

దానితో అలా చేస్తే ఈ సినిమా వరకు కాదు... స్టార్ హీరోలతో చేద్దాం అని నేను సలహా ఇచ్చాను. దానితో ఆయన వెంకటేష్ గారు నాకు టచ్ లోనే ఉన్నారు. ఆయన ఈ సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పాడు. దానితో మరో పాత్రకు పవన్ కళ్యాణ్ ను ట్రై చేద్దాం అనుకున్నాము. ఇక పవన్ కళ్యాణ్ ను కలిసే లోపే ఒక రోజు మహేష్ నాకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత రోజు నేను ఆయనను కలిసి ఈ సినిమా గురించి చెప్పాను. ఆయన ఈ సినిమాలో నటించడానికి ఆసక్తిని చూపించాడు. అలా మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు వచ్చాడు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: