పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27 వ తేదీన విడుదలై ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇలా ఇప్పటి వరకూ మొత్తం రూ. 363 కోట్ల షేర్, 725 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఈ సినిమా ఇంకా కేవలం 9 కోట్లు వసూళ్లు చేస్తే చాలు బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. నేటితో ఖచ్చితంగా లాభాల్లోకి వచ్చేస్తుంది. ఇక ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషించారు. దిశా పఠాని గ్లామర్ రోల్ లో బాగా మెప్పించింది.'కల్కి' సినిమా భారీ వసూళ్లతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు నాగ్ అశ్విన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 


ఇక ఈ సినిమాలో కృష్ణుడు రోల్ ఎంత బాగా హైలైట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి రోల్ లో మహేష్ బాబు నటించాలని నెటిజన్స్ ట్రెండ్ స్టార్ట్ చేశారు. అయితే మీడియాతో ముచ్చటించిన నాగ్ అశ్విన్ కి ఈ ప్రశ్న ఎదురయ్యింది."శ్రీ కృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అని సోషల్ మీడియాలో అంటున్నారు కదా.. మీ అభిప్రాయం?" అని ఈ ప్రశ్నకు.. "ఈ సినిమాలో కాదండి.. కానీ వేరే సినిమాలో ఆయన చేస్తే బాగుంటుంది" అని నాగ్ అశ్విన్ ఆన్సర్ ఇచ్చాడు. ఈ రిప్లై తో మహేష్ కల్కి 2 లో యాక్ట్ చేయరని క్లారిటీ ఇచ్చేశాడు నాగీ. 600 కోట్ల భారీ బడ్జెట్ తో కల్కి 2898 ఏడి సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్విని దత్ నిర్మించాడు.ఈ సినిమా రెండో భాగం కూడా రూపొందుతోందని, అందులో 60 శాతం పూర్తయిందన్న వార్త కూడా వినిపిస్తోంది. రెండో భాగంలో కొన్ని ముఖ్యమైన సీన్లను మాత్రం ఇంకా పూర్తిచేయాల్సి ఉందంటున్నారు. చాలా వరకు పూర్తయిపోయందనే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: