ఈ క్రమంలోనే నాగి కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు దీపికా పదుకొనే దిశా పటాన్ని లాంటి స్టార్ హీరోయిన్లు అమితాబచ్చన్, కమలహాసన్ లాంటి లెజెండరీ నటులు కూడా నటించారు. ఇక ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉండగా ఇక సినిమా విడుదలైన తర్వాత అందరి అంచనాలు అందుకోవడం కాదు అంతకుమించి అనే రేంజ్ లోనే ప్రేక్షకులను మెప్పించగలిగింది ఈ మూవీ. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో రికార్డులను వసూళ్ల సునామీతో చెరిపేస్తూ వస్తుంది కల్కి మూవీ. ఈ సినిమాకు సీక్వల్ కూడా ఉండబోతుందని నాగ్ అశ్విన్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే.
కాగా ఈ మూవీలో అశ్వద్ధామ, కర్ణుడు, సుప్రీమ్ యాస్కిన్ పాత్రలు ప్రశంసలు అందుకుంటున్నాయి అని చెప్పాలి. అయితే ఇందులో కొన్ని పాత్రలు కేవలం కొంతసేపు మాత్రమే ఉన్నాయి. ఇక రెండవ పార్ట్ లో మాత్రం సినిమా మొత్తం ఈ పాత్రలు చుట్టే తిరుగుతుంది అన్నది తెలుస్తోంది. అయితే ఈ పాత్రల అసలు కథంతా సీక్వెల్ లోనే ఉంటుందని దర్శకుడు నాగీ చెప్పుకొచ్చారు. అశ్వత్థామ, కర్ణుడు, సుప్రీమ్ యాస్కిన్ మధ్య శక్తివంతమైన ధనస్సు కీలకపాత్ర పోషించనుంది అంటూ చెప్పుకొచ్చాడు. సీక్వల్ కు సంబంధించి నెలరోజులు షూటింగ్ చేశాం. ఎంతో బాగా వచ్చింది ఇంకా తీయాల్సి ఉంది. వీటికి సంబంధించిన సూపర్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి అంటూ నాగ్ అశ్విన్ చెప్పిన కామెంట్స్ పార్ట్ 2 పై అంచనాలను మరింత పెంచేశాయ్.