ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజాగా డబల్ ఈస్మార్ట్ అనే మూవీ లో హీరోగా నటించాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సంజయ్ దత్ ఓ కీలకమైన పాత్రలో నటించగా , మెలోడీ బ్రహ్మ మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కావ్య దాపర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసిన తర్వాత ఈ తేదీ పైనే అనేక మంది కన్ను పడింది.

ఇప్పటికే తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి విక్రమ్ హీరో గా రూపొందుతున్న తంగాలం మూవీ ని కూడా ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం హరిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తూ ఉండగా , ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. జగపతి బాబు ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

మూవీ విడుదల తేదీని ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను కూడా ఆగస్టు 15 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని కూడా ఇదే తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసినట్లు అయితే రామ్ కి తంగాలం , మిస్టర్ బచ్చన్ నుండి గట్టి పోటీనే ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇంత పోటీలో సినిమా నెగ్గుకు రావాలి అంటే బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరి ఈ మూడు సినిమాలు ఒకే రోజు విడుదల అవుతాయా ..? ఏమైనా తేదీలు మారుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: