టాలీవుడ్ మాస్ రాజా రవితేజ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన సినిమాలంటే తెలుగు కుర్రకారుకి ప్రత్యేకమైన అభిమానం. అందుకే రవితేజ సినిమా రిలీజైతే అభిమానులే కాకుండా యావత్ అందరి హీరోల అభిమానులు కూడా అతని సినిమాని చూడడానికి క్యూలు కడతారు. అయితే ఈ మధ్య రవితేజకి కాస్త బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. సక్సెస్ ఫెయిల్యూర్ లు అనేవి ఓ మనిషికి కామనే అయినప్పటికీ ఒక మంచి కాంబినేషన్ సినిమా సెట్ అవుతుంది అనుకునేలోగా అది కాస్త ఏవో కారణాల వల్ల చెడిపోయింది అనే వార్త నిజంగా బాధాకరం.

విషయం ఏమిటంటే... ఆ మధ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్లో రవితేజ హీరోగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమాని అనౌన్స్ చేశారు. ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా సక్సెస్ కావడంతో ఈసారి కూడా ఈ ఇద్దరి కాంబినేషన్ బంపర్ హిట్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ సినిమా అయితే అనౌన్స్ మెంట్ చేశారు కానీ, బడ్జెట్ ఇష్యూస్ వల్ల సినిమా క్యాన్సిల్ చేసుకున్నారని వినికిడి. దాంతో మాస్ రాజా అభిమానులు ఒకింత అసహనానికి గురవుతున్నారు. ఇక ఇదే బ్యాడ్ న్యూస్ అనుకుంటే.. రవితేజ మరో సినిమా కూడా ఇపుడు మరొకరి చేతుల్లోకి వెళ్ళిపోతుందని గుసగుసలు వినబడుతున్నాయి.

జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో రవితేజ హీరోగా ఒక సినిమా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇది అనౌన్స్ చేసినట్టు పెద్దగా ఎవరికీ తెలియదు. మాస్ మహరాజ్ ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరి కాంబినేషన్ అంటే ఇక జాతరే అని అనుకున్నారు. అయితే వాళ్లకి షాక్ ఇస్తూ సినిమా అటకెక్కిందని అంటున్నారు కొంతమంది సినిమా విశ్లేషకులు. అవును, అనుదీప్ కెవి రవితేజ సినిమా కూడా ఎందుకో మెటీరియలైజ్ కాలేకపోయిందని అంటున్నారు. అంతవరకూ ఓకే కానీ ఆ సినిమా రవితేజకి బదులుగా విశ్వక్ సేన్ తో అనుదీప్ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలవడంతో రవి అన్న అభిమానులు చాలా బాధపడుతున్నారు. కాగా రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మాస్ రాజా ప్రూవ్ చేసుకోకపోతే ఇక రవితేజ కెరీర్ కష్టమేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: