కొంతకాలం వరకు స్టైలిష్ విలన్స్ అంటే ప్రకాష్ రాజ్ జగపతి బాబు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఇప్పుడు వీరి హవా పూర్తిగా తగ్గిపోవడంతో వారి స్థానాన్ని విజయ్ సేతుపతి ఆక్రమించాడు. అయితే అనూహ్యంగా గత సంవత్సరం విడుదలైన ‘యానిమాల్’ మూవీతో ఒకనాటి బాలీవుడ్ హీరో బాబి డియోల్ మ్యానియా దక్షిణాది సినిమా రంగంలో మొదలైంది.


ఒకప్పుడు ఈబాలీవుడ్ హీరోకు 4 కోట్ల పారితోషికం ఇవ్వడం కూడ చాలఎక్కువ అనుకునే వారట. అయితే ‘యానిమల్’ మూవీ తరువాత అతడి మ్యానియా విపరీతంగా పెరగడంతో ప్రస్తుతం అతడి పారితోషికం 10 కోట్ల స్థాయిలో ఉంది అన్నవార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీ పూర్తిగా మర్చిపోయిన బాబి డియోల్ ను మళ్ళీ అందరికీ గుర్తుకు చేసింది ఒక తెలుగు దర్శకుడు.


సందీప్ వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ మూవీతో ఈ నటుడి సెకండ్ ఇన్నింగ్స్ చాల క్రేజీగా మొదలైంది. ప్రస్తుతం ఈవిలక్షణ నటుడి మ్యానియా దక్షిణాది సినిమా రంగంతో పాటు ఉత్తరాది సినిమా రంగంలో కూడ బాగా కనిపిస్తూ ఉండటంతో అతడికి అనేక భారీ సినిమాలలో అనేక అవకాశాలు వస్తున్నాయి. తమిళ ఫిలిమ్ ఇండస్ట్రీ ‘బాహుబలి’ గా అంచనాలు పెంచుకున్న ‘కంగువ’ లో సూర్య పక్కన విలన్ గా ఇతడు చాల పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు.


పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీలో ఇతడు ఔరంగ జేబు పాత్రలో కనిపించబోతున్నాడు. లేటెస్ట్ గా బాలయకృష్ణ నటిస్తున్న మూవీలో కూడ ఈబాలీవుడ్ ఒకప్పటి హీరో విలన్ గా నటిస్తున్నాడు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ అలియా భట్, శార్వరి వాఘ్ తో తీస్తున్న లేడీ స్పై మూవీలో ఇతనే మెయిన్ విలన్. మోహన్ లాల్ తో ‘ఒప్పం’ హిందీ రీమేక్ లో కూడ ఇతడు నాటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా వరసపెట్టి బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ లలో టాప్ హీరోల సినిమాలకు మెయిన్ విలన్ గా ఈబాలీవుడ్ యాక్టర్ మ్యానియా కొనసాగుతోంది..  






మరింత సమాచారం తెలుసుకోండి: