టాలీవుడ్ డైరెక్టర్ సాయి రాజేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పలు చిత్రాలకు దర్శకత్వం వహించినప్పటికీ గత ఏడాది ఆయన డైరెక్షన్లో రూపొందిన బేబీ చిత్రంతో ఆయనకే మంచి గుర్తింపు దక్కింది. అంతకు ముందు వరకు అనేక సినిమాలకి డైరెక్షన్ వహించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే బేబీ సినిమాని డైరెక్ట్ చేశాడు అప్పటినుంచి ఈయన పేరు మారుమోగుతుంది. ఇక బేబీ సినిమా పై పలువురు సినీ స్టార్స్ సైతం ప్రశంసలు కురిపించడంతో పాటు సాయి రాజేష్ ను మెచ్చుకున్నారు. చిరంజీవి కూడా బేబీ డైరెక్టర్ అండ్ నిర్మాతను ఇంటికి పిలిచి మరి సన్మానం చేశారు.


ఇక ఇదిలా ఉంటే తాజాగా సాయి రాజేష్ instagram వేదికగా ఓ వింత అనుభవం గురించి వివరిస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. తాను చేసిన సినిమా బేబీ అయినప్పటికీ ఓ బేబీ గురించి మాట్లాడడంతో సాయి రాజేష్ వింత అనుభవం ఎదురయిందని దానిని వివరించాడు. " నిన్న ఒక స్నేహితుడు బలవంతం మీద తన ప్రాణ స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్లాను. నీ సినిమా అంటే మా వాడికి ప్రాణం.. 50 సార్లు చూసుంటాడు. ఇన్నేళ్ల మా స్నేహంలో ఏది అడగలేదు. నిన్ను భోజనానికి తీసుకు రమ్మన్నాడు.. అని అన్నాడు. సర్లే మనకి ఈ చపాతీలు అండ్ రోటీలు మొహం మొత్తింది.


హోమ్ ఫుడ్ తినొచ్చు అని వెళ్లాను. 10 రకాల వంటలు అద్భుతమైన అతిథ్యం, ఎంత గొప్ప సినిమా సార్.. అని వాళ్ళ ఆవిడకి అండ్ పక్కింటి వాళ్లకి, గేట్ దగ్గర వాచ్ మ్యాన్ కి, కొరియర్ బాయ్ కి, సార్ తో సెల్ఫీ దిగండి.. బేబీ సినిమా డైరెక్టర్ హనీ 30 ఫోటోలు ఇప్పించారు. ఒక గంట తర్వాత ప్లేట్లో గారెలు, నాటుకోడి పులుసు వడ్డించారు. మా అమ్మకి సమంత అంటే చాలా ఇష్టమండి. ఒక ఫోటో ఇప్పించండి. మళ్లీ ఎప్పుడు చేస్తున్నారు ఆవిడతో.. అని అన్నారు. ఇంత జరిగినా గారెలు సిగ్గు లేకుండా లోపలికి వెళ్లి పోయాయి. ఓ బేబీ.. అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం సాయి రాజేష్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: