ప్రస్తుతం సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్న పేరు రాజ్ తరుణ్ . సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న న్యూస్ ఏదైనా ఉంది అంటే ఈ హీరో న్యూస్ .  ఇక  హీరో తనను ప్రేమించి మోసం చేశాడంటూ .. మాజీ ప్రేయసి లావణ్య పలు ఆరోపణలు చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది . అయితే దీనిపై స్పందించిన రాజ్ తరుణ్ తనతో రిలేషన్ లో ఉన్న మాట నిజమేనని కానీ తాను డ్రగ్స్ కు అలవాటు పడింది అని తెలియడంతో .. తనకు దూరం అయ్యాను అని తెలియజేశాడు .


అదేవిధంగా ఆమె నాపై చేస్తున్న ఆరోపణలలో ఎటువంటి వాస్తవం లేదు అంటూ ఆయన పేర్కొన్నారు . ఇక తాజాగా ఈ కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది . తనను మోసం చేశాడని హీరో రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్య కె రివర్స్ లో నర్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు . ఇక అందుకు సంబంధించిన ఆధారాలు త్వరగా సమర్పించాలని వారు ఆమెకు తెలిపారు . 91 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు . కానీ ప్రస్తుతం ఆమె కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోయినట్లు సమాచారం .


ఇక  ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది . ఇక  నిన్నటి వరకు తెగ హడావిడి చేసిన .. లావణ్య ఉన్నట్లుండి తనకి ఆపోజిట్ గా పోలీసుల నుంచి స్పందన రావడంతో కనుమరుగు అయింది . ఇక రాజ్ తరుణ్ విషయానికి వస్తే .. ఇటీవలే నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగాల చిత్రంతో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చాడు . అడపాదడపా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు ఈ హీరో .

మరింత సమాచారం తెలుసుకోండి: