పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "బద్రి" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమానే పూరీ కి దర్శకుడిగా మొదటి మూవీ. ఇకపోతే పవన్ తో మొదటి సినిమా చేసే అవకాశం ఎలా వచ్చింది అనే వివరాలను తాజాగా పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ... సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలి అనుకున్నాను. ఆయనకు కథ చెప్పడానికి చాలా నెలలు కష్టపడ్డాను.

ఒక రోజు ఆయన మేనేజర్ నాకు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు రేపు కథ వింటాను అన్నారు మీరు రండి అని చెప్పారు. నేను ఉదయాన్నే పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గరకు వెళ్లాను. ఆయన నన్ను పిలిచారు కథ చెప్పమన్నారు. నేను కథ మొత్తం చెప్పాను. ఇక కథ మొత్తం ఆయనకు బాగానే నచ్చింది. కాకపోతే క్లైమాక్స్ విషయంలో మాత్రం ఆయన అంతగా సంతృప్తి చెందలేదు. అందులో కొన్ని మార్పులు చేయమని చెప్పాడు. దానితో నేను ఈయన మాస్ హీరో కదా అని చెప్పి కొన్ని ఫైట్లు ఉన్న క్లైమాక్స్ రాశాను. కానీ అవి నాకే నచ్చలేదు. మళ్ళీ ఒక రోజు నాకు పవన్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది.  

నేను వెళ్లి క్లైమాక్స్ మళ్లీ క్లుప్తంగా వివరించి చెప్పాను. దానితో ఆయన ఆ రోజు చెప్పిందే మళ్ళీ ఈ రోజు చెప్పావు కదా అంటే అని ఆయన అన్నారు. దానితో నేను ఈ కథకి వేరే క్లైమాక్స్ పెడితే బాగోదు సార్ అందుకే మీకు క్లియర్ గా క్లైమాక్స్ మళ్లీ వివరించాను అని చెప్పను. దానితో ఆయన నువ్వు క్లైమాక్స్ మార్చలేదు అందుకే నేను ఈ సినిమా చేస్తాను. నువ్వు కనుక నేను చెప్పాను అని క్లైమాక్స్ మార్చినట్లు అయితే నేను నీతో సినిమా చేసే వాడిని కాదు అని అన్నాడు దానితో నేను షాక్ అయ్యాను ఇలా పూరి జగన్నాథ్ "బద్రి" సినిమా అవకాశం ఎలా వచ్చింది అనే వివరాలను తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: