టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై సడన్‌గా ఓ కంట్రవర్సీ వచ్చి పడింది. లావణ్య అనే యువతి తనను పెళ్లి చేసుకుంటా అని మాయ మాటలు చెప్పి ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడని, తనని మోసం చేశాడని, ఇప్పుడు నటి మాల్వీ మాల్హోత్రతో ప్రేమాయణం సాగిస్తున్నాడు అంటూ రాజ్ తరుణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మాల్వీ మాల్హోత్ర ప్రస్తుతం రాజ్ తరుణ్‌తో తిరగబడరా సామి అనే సినిమాలో నటిస్తుంది.ఇక లావణ్య కేసుతో ఒక్కసారిగా రాజ్ తరుణ్ వార్తల్లోకి వచ్చాడు. అయితే దీనిపై రాజ్ తరుణ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వెంటనే స్పందించాడు. లావణ్యతో రిలేషన్ షిప్ నిజమే, కానీ, ఆమె డ్రగ్స్ కు అలవాటు పడిన నాటి నుంచి తన రెప్యూటేషన్ తగ్గిపోతుందని దూరంగా ఉంటున్నట్టు రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. ఇంకా అలాగే హీరోయిన్ మాల్వీ మాల్హోత్రతో ఎఫైర్ అని లావణ్య చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజం లేదని కూడా వివరించాడు.


అయితే దీని అంతటికి కూడా ఓ కారణం ఉంది అంటూ ఇండస్ట్రీలో బలమైన టాక్ వస్తుంది. అది ఏంటంటే రాజ్ తరుణ్ పై కావాలనే ఈ కేసు పెట్టించారట ఇండస్ట్రీలో ఓ పెద్ద ప్రొడ్యూసర్.రాజ్ తరుణ్ పై కావాలనే లావణ్య చేత ఈ కేసు పెట్టించారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. రాజ్ తరుణ్ కు బ్యాడ్ నేమ్ రావాలని, ఆయన మాజీ ఇలా లవర్‌తో కేసు పెట్టించాడని, దీని వల్ల రాబోయే సినిమాపై ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందని ప్రొడ్యూసర్ అనుకుంటున్నట్టు సమాచారం తెలుస్తుంది.రాజ్ తరుణ్ గతంలో ఈ ప్రొడ్యూసర్‌తో మూవీ చేస్తా అని మాట ఇచ్చారట. అయితే తర్వాత రాజ్ తరుణ్ ఈ మాటను నిలబెట్టుకోకుండా… ఆ సినిమాని దాట వేస్తూ వేరే నిర్మాతలకు కమిట్‌మెంట్ ఇస్తున్నారట. దీంతో విసుగు చెందిన ఆ నిర్మాత… రాజ్ తరుణ్‌కు ఎలా బుద్ది చెప్పాలని ఇలా చేస్తున్నాడు అని ఇండస్ట్రీలో గాసిప్స్ వినిపిస్తున్నాయి.ఇక రాజ్ తరుణ్ – మాల్వీ మల్హోత్ర కలిసి నటిస్తున్న తిరగబడరా సామి మూవీ త్వరలో రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: