మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ హిందీ లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన రైడ్ అనే మూవీ కి రీమేక్ గా రూపొందుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా , జగపతి బాబు ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా , మిక్కీ జే మేయర్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. 

ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరో రెండు , మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించకపోయిన ఈ మూవీ బృందం వారు మాత్రం ఈ సినిమా ప్రమోషన్లను ఇప్పటికే మొదలు పెట్టారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఓ చిన్న వీడియోను ఈ మూవీ నుండి విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక తాజాగా ఈ మూవీ నుండి "సితార్" అంటూ సాగే మొదటి పాటను జూలై 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ లు మొదలు పెట్టిన విడుదల తేదీని మాత్రం అనౌన్స్ చేయకపోవడంతో రవితేజ అభిమానులు ఈ మూవీ బృందంపై కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. మరి ఈ సినిమా విడుదల తేదీని కూడా మరికొన్ని రోజుల్లో ఈ మూవీ మేకర్స్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: