టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకుంది. అయితే ఎన్నో ఏళ్లుగా ఎన్నో సినిమాలను చేసిన ఈ బ్యూటీ ఇప్పటికీ ఒక్క సినిమాలో కూడా స్కిన్ షో చేయలేదు. స్కిన్ షో కి దూరంగా అందరి హీరోయిన్ లకి భిన్నంగా సినిమాలను ఎంచుకుంటూ ఉంటుంది సాయి పల్లవి. ఇప్పుడున్న హీరోయిన్స్ అందరూ కూడా రొమాంటిక్ బోల్డ్ సన్నివేశాలు నటిస్తున్నప్పటికీ సాయి పల్లవి మాత్రం వాటి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. ఎప్పుడు

 సాంప్రదాయ దుస్తులను ధరిస్తూ చీరకట్టు.లోనే కనబడుతూ ఉంటుంది. ఇప్పటివరకు ఒకసారి కూడా షార్ట్ డ్రెస్సుల్లో కనిపించలేదు. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించింది సాయి పల్లవి. ఆమె షార్ట్ బట్టలు వేసుకోకపోవడం స్కిన్ షో చేయకపోవడం పై పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. దీంతో ఆమె చేసిన పలు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.. 'నేను జార్జియాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. అప్పుడు నేను టాంగో నేర్చుకున్నాను. ఇందుకోసం నేను పొట్టి బట్టలు

 వేసుకోవాల్సి వచ్చింది. నేను నా తల్లిదండ్రుల నుంచి పర్మిషన్ తీసుకున్నాను. దీనికి వారు ఓకే చెప్పారు. ఆ తర్వాత నేను నటించిన ప్రేమమ్‌ విడుదలైంది. నా పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత నా టాంగో డ్రెస్ వైరల్ అయింది. ఈ సమయంలో ప్రజలు నా దుస్తులపై కామెంట్స్ చేశారు. నేను చాలా అసౌకర్యంగా భావించాను,' అని తెలిపింది. ఆ సంఘటన తర్వాత నేను సంప్రదాయంగా ఉండటానికే ఇష్టపడతాను. ఒక పని చేసి మాటలు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. బట్టలను బట్టి మనిషిని అంచనా వేయడం సరికాదు. నేను వేసుకునే దుస్తులు నా వ్యక్తిత్వాన్ని చూపించవు' తెలిపింది. అలా ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది సాయి పల్లవి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: