టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ తాజాగా నటించిన చిత్రం తిరగబడరా సామి.. ఇందులో హీరోయిన్గా నటించిన మాల్వి మల్హోత్రా.. అయితే ఈమెతో ఎఫైర్ ఉందని రూమర్స్ ని గతంలో రాజ్ తరుణ్ లవర్ గా పేరు పొందిన లావణ్య ఇటీవలే పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి మరి కంప్లైంట్ ఇచ్చింది. అయితే ఈ విషయం పైన అటు రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా మాల్వి మల్హోత్రా గురించి పలు విషయాలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.


మాల్వి మల్హోత్రా హిమాచల్ ప్రదేశానికి చెందిన అమ్మాయి. ఈమె కూడా పంజాబీ కుటుంబానికి చెందిన నటి. ఆ తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్ చేసింది.. నటిగా ముందు కనిపించింది మాత్రం బుల్లితెరపైనే అది కూడా 2017లో విడుదలైన ఉడాన్ అనే సీరియల్ ద్వారా పరిచయమైంది. వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం హోటల్ మిలన్ ఇది 2018 లో విడుదలైంది. ఆ తర్వాత నాలుగేళ్లకు ఒక షార్ట్ ఫిలిం తమస్ లో నటించింది అది 2022లో విడుదలయ్యిందట.


ఆ తర్వాత సంవత్సరం మాల్వి ఒక ఓటీటీ చిత్రంలో నటించింది. అది పెద్దగా గుర్తింపు రాబట్టలేదట. 2023లో అబ్రహం అనే చిత్రంతో మలయాళం లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాతే రాజ్ తరుణ్ హీరోగా నటించిన తిరగబడరా సామి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే రాజ్ తరుణ్ తో ఎఫైర్ ఉందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. రాజ్ తరుణ్ మాత్రం ఈమె తనకు మంచి స్నేహితురాలని తెలియజేశారు. సరైన సక్సెస్ లేక రాజ్ తరుణ్ కి చాలా సంవత్సరాలు అవుతోంది మరి ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: