ఇలా వీరిద్దరు ఎంతో చనువుగా ఉండడం చూసి వీరిద్దరూ కచ్చితంగా ప్రేమలో ఉన్నారని అప్పట్లో పలు రకాలు రూమర్స్ కూడా వినిపించాయి.. కానీ చివరికి ఆ నోట ఈ నోట భానుప్రియ తల్లి వరకు ఈ విషయం చేరడంతో అలాగే వంశీ భార్యకు కూడా ఈ విషయం తెలిసి.. భానుప్రియ తల్లి తన కూతురిని వంశీకి దూరంగా ఉంచాలని అప్పుడే నిర్ణయం తీసుకుందట.. అప్పటికే తనకు వివాహం కావడంతో భానుప్రియ ప్రేమను తన తల్లి కూడా అంగీకరించలేదని సమాచారం.
దీంతో భానుప్రియ తన తల్లి చెప్పిన మాట విని వంశీని దూరం పెట్టడం జరిగిందట. ఇలా దూరం అవ్వడం భానుప్రియ తట్టుకోలేని వంశీ సరాసరి భానుప్రియ ఇంటికి వెళ్లి మరి తనని వివాహం చేసుకుంటారా అని అడగగా.. భానుప్రియ తల్లి మళ్ళీ తనని తమ ఇంటి వైపు రాకూడదని వంశీకి వార్నింగ్ ఇచ్చి పంపించినట్లు సమాచారం. మరొకవైపు వంశీ భార్య కూడా ఈ విషయం తెలిసి తన భర్తను భానుప్రియకు దూరం చేసేలా చేసిందంట ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట చివరికి విడిపోవలసి వచ్చిందట. అయితే భానుప్రియ మరొక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకొని యూఎస్ఏ లో స్థిరపడ్డారు ఆ తర్వాత కొన్ని కారణాల చేత భానుప్రియకు కూతురు జన్మించిన తర్వాత విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది.