టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్లలో టబు కూడా ఒకరు.. ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉన్నది.. పలు భాషలలో కూడా హీరోయిన్గా నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న టబు.. ఈ మధ్యకాలంలో నటిగా కూడా మరింత క్రేజ్ అందుకుంది. తాజాగా బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తున్న టబు ఇటీవలే అజయ్ దేవగన్ తో కలిసి మరొక సినిమాలో నటించింది. దీంతో అజయ్ దేవగన్ పైన పలు విషయాలను తెలియజేసింది టబు.



తనకు సినీ పరిశ్రమలో నిర్మాతల వద్ద ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా తన తరఫున మాట్లాడడానికి అజయ్ దేవగన్ ని పిలుస్తానని తెలియజేసింది. ఆయన కూడా తనకు అన్ని విషయాలను తెలియజేస్తూ ఉంటారని అంతే కాదు తనతో కలిసి పనిచేయడానికి ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటారని తెలిపింది టబు.. మేము ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ నా నిర్ణయాలలో ఎప్పుడు ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదని ఒకరిని ప్రభావితం చేయడానికి కూడా అజయ్ దేవగన్ ఎప్పుడూ కూడా ప్రయత్నించరని తెలిపారు.


ఆయన ప్రతి ఒక్కరిని గౌరవిస్తారని అజయ్ దేవగన్ తెలిపింది.. అలాగే నా సోదరుడికి చిన్ననాటి స్నేహితుడు అని తెలిపింది టబు. సినిమాలలోకి రాకముందే అజయ్ తనకు బాగా తెలుసు అని ఆయనకు వివాహమయ్యాక కూడా తమ స్నేహంలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపింది టబు ఆయన దర్శకుడు కావాలని కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ హీరోగా మారిపోయారని తెలియజేసింది టబు. గతంలో కూడా వీరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పటికీ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రాలు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. అయితే టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం టబు ని సినిమాలలో నటించాలని కోరుకుంటున్నారు. చివరిగా అలా వైకుంఠపురం సినిమాలో మాత్రమే నటించింది టబు.

మరింత సమాచారం తెలుసుకోండి: