నందమూరి బాలకృష్ణ అంటే సినీ ఇండస్ట్రీలో చాలామంది కఠినంగా కనిపించే వ్యక్తి అంటూ తెలియజేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అభిమానుల పైన కూడా చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వీటివల్ల ఎన్నోసార్లు విమర్శల పాలయ్యారు బాలయ్య.. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి తన సింప్లిసిటీతో అభిమానుల మనసుని గెలుచుకున్నారు బాలయ్య.. అసలు విషయంలోకి వెళ్తే ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో మూడవసారి ముచ్చటగా హిందూపురం నుంచి బాలయ్య గెలిచారు.. దీంతో హ్యాట్రిక్ విజయాన్ని కూడా అందుకోవడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.


ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలతో బాలయ్య అభిమానులను పార్టీ కార్యకర్తలను మెప్పిస్తూనే ఉన్నారు. తాజాగా స్థానిక ప్రజలతో కలిసి బాలయ్య భోజనం కూడా చేయడం జరిగింది.. ఈ సందర్భంగా ఒక వృద్ధురాలు భుజం పైన చాలా ఆప్యాయంగా చేయి వేసి మరి పలకరిస్తూ ఉన్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. సాధారణంగా సెలబ్రిటీలు అయినా ఎమ్మెల్యే అయినా కూడా సాధారణ జనాలను కలవడం చాలా అరుదుగా మనం చూస్తూనే ఉంటాము.


మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య మాత్రం ఎలాంటి గర్వం చూపించకుండా కేవలం చిన్నపిల్లడి లాగా మారిపోయి తన పక్కన కూర్చున్న వారితో జోకులు వేస్తూ మరి భోజనం చేస్తూ ఉన్నారు. దీనిని చూసిన అభిమానులు చాలా మురిసిపోతూ ఉన్నారు. మరి కొంతమంది అభిమానులు బాలయ్యను ప్రశంసిస్తూ ఉన్నారు. ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ప్రస్తుతం బాలయ్య సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్నది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరొకసారి బాలయ్య సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బాలయ్య ఎన్నికల ఫలితాల తర్వాత మరింత ఆప్యాయంగా ప్రజలను మాట్లాడిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: