ప్రతి నటికి కూడా ఏదో ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. కొంత మంది కి క్లాస్ పాత్రలో నటిస్తూ ఉంటే మాస్ పాత్రలో నటించాలి అని , మరి కొంత మంది కి క్లాస్ పాత్రలలో నటిస్తూ ఉంటే రొమాంటిక్ పాత్రలలో నటించాలని , మరి కొంత మంది కి యాక్షన్ సినిమాలలో నటించాలని ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డ్రీమ్ పాత్రలు ఉంటాయి. ఇకపోతే తెలుగులో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటీమణులలో ఒకరు అయినటువంటి రష్మిక మందనకు కూడా ఒక డ్రీమ్ రోల్ ఉందట.

ఇక రష్మిక మందనకు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించి ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సౌందర్య బయోపిక్ లో నటించాలి అనే కోరిక ఉందట. రష్మిక కి సౌందర్య ఎంతో ఇష్టమట. ఈమె కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఈమెకు సంబంధించిన చాలా సినిమాలను రష్మిక చుసేదట. అలాగే కొంత మంది ఈమెను సౌందర్యల ఉన్నావు అని అన్నవారు కూడా ఉన్నారట. తాజాగా ఈ బ్యూటీ సౌందర్య బయోపిక్ లో నటించాలని ఉన్నట్లు వెల్లడించింది. ఇకపోతే ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

కొంతకాలం ఈమె అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరోయిన్ గా నటించి దేశ వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు ఇతర భాష సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ముఖ్యంగా హిందీ నుండి ఈమెకి వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లోను , సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న సికిందర్ సినిమాలను హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు మూవీ లతో పాటు మరికొన్ని సినిమాలలో కూడా ఈ బ్యూటీ ప్రస్తుతం నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: