టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె తన అందం, అభినయంతో పాటు వ్యక్తిత్వంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి ఏకంగా మెడిసిన్ చదివింది.అయితే ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. హీరోయిన్ గా రిటైరయ్యాక డాక్టర్ గా స్థిర పడతానంటూ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా వేసుకుంది సాయి. గతంలో ఆమె సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నప్పుడు కూడా సొంతూరులో క్లినిక్ స్టార్ట్ చేసిందంటూ పుకార్లు కూడా షికార్లు చేశాయి. అయితే అవేవీ నిజం కాదు. మళ్లీ ఆమె హీరోయిన్ గా బిజీ అయిపోయిందీ. ప్రస్తుతం బాలీవుడ్ లో రామయాణం ఆధారంగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీలో సీతగా నటిస్తోందీ ఈ సహజమైన ముద్దుగుమ్మ. ఈ సినిమా నుంచి రిలీజైన ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలయ్యాయి. ముఖ్యంగా సీతమ్మ గెటప్ లో సాయి పల్లవి లుక్ అయితే సూపర్బ్ గా ఉందంటూ ప్రశంసలు వస్తున్నాయి. 


సినిమాల సంగతి పక్కన పెడితే సాయి పల్లవికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇక అదేంటంటే.. తాజాగా జార్జియాలోని తాను మెడిసిన్ చదువుకున్న ఆమె టీబీలీసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ డేకు సాయిపల్లవి హాజరైంది. తనతో పాటు చదువుకున్న స్నేహితులను ఇంకా అధ్యాపకులను కూడా ఆమె పలకరించింది.ఇక ఈ సందర్భంగా వేదికపై డాక్టర్ పట్టాను అందుకున్న సాయి పల్లవి ఫొటోలకు ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇంకా వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 'సాయి పల్లవి ఇకపై డాక్టర్ సాయి పల్లవి' అంటూ అభిమానులు, నెటిజన్లు ఎంతో క్రేజీగా కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య సరసన తండేల్ అనే మూవీలో నటిస్తోంది సాయి పల్లవి. చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయ్యింది. ఈ సంవత్సరం డిసెంబర్ 20న ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో సత్య పాత్రలో కనిపించనుంది సాయి పల్లవి.

మరింత సమాచారం తెలుసుకోండి: