లోక నాయకుడు కమలహాసన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ సినిమా భారతీయుడు 2. భారతీయుడు సినిమాకి సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనా లో నలుపు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా ఈనెల 12న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. దీంతో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలలో వేగం పెంచారు బృందం. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించడం జరిగింది. ఇక ఇందుకుగాను శంకర్ కమలహాసన్ తో పాటు ఇందులో కీలకపాత్రలో కనిపించబోతున్న ఎస్ జె సూర్య సైతం హాజరయ్యారు.

 వీరే కాకుండా ఇందులో మరికొన్ని పాత్రలో కనిపించబోతున్న సిద్ధార్థ రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. భారతీయుడు 2 తర్వాత న్యూస్ పేపర్స్ చూసిన ప్రతి సారి భారతీయుడు గుర్తుకు వచ్చేవారు. పేపర్ లో లంచం గురించి వార్త వచ్చేది. ఇలాంటప్పుడు భారతీయుడు వస్తే బావుంటుంది కదా అనిపించేది. కానీ కథ పూర్తిగా దొరకలేదు.  2.0 చిత్రం తెరకెక్కిస్తున్న సమయంలో భారతీయుడు 2 కథకి సంబంధించిన ఐడియా వచ్చింది అని శంకర్ తెలిపారు. 28 ఏళ్ళ క్రితం భారాతీయుడు తీస్తున్నప్పుడు ఆ గెటప్ లో కమల్ హాసన్ ని చూస్తే ఎలాంటి గూస్ బంప్స్ వచ్చాయో.. ఇన్నేళ్ల తర్వాత ఆయన్ని

అదే గెటప్ లో చూస్తే అంతకి మించిన గూస్ బంప్స్ వచ్చాయి అని శంకర్ అన్నారు. నా లాగే మీరు కూడా థియేటర్స్ లో గూస్ బంప్స్ ఫీలవవుతారు అని అన్నారు.   చివర్లో శంకర్ రాంచరణ్ గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇచ్చారు.  రాంచరణ్ పోర్షన్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా త్వరలో పూర్తవుతుంది. త్వరలో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం అని అన్నారు. రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉంటుంది అని శంకర్ ప్రశంసించారు. అలా గేమ్ చేంజర్ గురించి శంకర్ అప్డేట్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ అందరూ ఖుషి అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: