పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ ప్రస్తుతం థియేటర్ల వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది అన్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా.. నిర్మాతలకు లాభాల పంట పండిస్తుంది. వైజయంతి మూవీస్ పతాకం పై ఈ మూవీని అశ్విని దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు అన్న విషయం తెలిసిందే.


 ఈ మూవీలో హీరోగా ప్రభాస్ నటిస్తే కీలకపాత్రలో అమితాబచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులు నటించారు. మరోవైపు దీపిక పదుకొనే దిశా పటాని లాంటి స్టార్ హీరోయిన్లు కూడా నటించారు. అంతేకాదు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది స్టార్స్ కూడా ఇక కల్కి సినిమాలో స్పెషల్ రోల్స్ లో కనిపిస్తూ ఆ ప్రేక్షకులను అలరించారు. ఇప్పటివరకు ప్రకటించిన డీటెయిల్స్ ప్రకారం కల్కి మూవీ ఏకంగా 800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వాస్తవానికి ఈ రోజుల్లోసినిమా నిర్మాత అయినా కూడా తమ సినిమాలో ఒరిజినల్ కలెక్షన్లను వెల్లడిస్తున్నారా లేదు ఫేక్ కలెక్షన్లే చెబుతున్నారా అనే చర్చ ప్రతిసారి కూడా తెరమీదికి వస్తోంది.

 ఇప్పుడు కల్కి కలెక్షన్స్ విషయంలో కూడా ఇదే జరిగింది అంటూ ఒక న్యూస్ వైరల్ గా మారిపోయింది. బాహుబలి, త్రిబుల్ ఆర్, సలార్ రికార్డులను బదులు కొట్టి కొత్త రికార్డుల దిశగా కల్కి ముందుకు సాగుతుందని అంచనాలు వేసుకోగా.. అందుకు విరుద్ధంగా కల్కి కలెక్షన్లకు సంబంధించిన లోగుట్టు మరొకటి ఉంది అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. 11వ రోజు వచ్చేసరికి కలెక్షన్లు తగ్గాయి అన్నది ప్రతి సినిమా విషయంలో సహజమే. అయితే ప్రస్తుతం తగ్గిన కలెక్షన్స్ చూసుకుంటే నిర్మాణ సంస్థ టార్గెట్ గా పెట్టుకున్న 1500 కోట్లు కలెక్షన్స్ రాబట్టడం కష్టమేనని అర్థమవుతుంది. దీంతో కల్కి నిర్మాత అశ్వినీదత్ మాత్రం చాకచక్యంగా వ్యవహరించి నాగ్ అశ్విన్ తో మీడియా సమావేశం ఏర్పాటు చేయించారు కల్కి సినిమాకి సంబంధించిన ప్రశ్నలు సమాధానాలతో ఇది జరిగింది. ఇలా జరిగితే సహజంగానే ఆసక్తి కలుగుతుంది. ఇక అనుకున్నట్లుగా కల్కి 1500 కోట్ల వసూళ్లు చేయాలంటే ఇంకో 700 కోట్లు వసూలు రాబట్టాల్సి ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: