ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ తాప్సి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే గత కొంతకాలంగా తాప్సి బాలీవుడ్ లోనే వరస సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోని తనకి ఎక్కువ సినిమా అవకాశాలు వస్తున్నాయి. అలాగే బాలీవుడ్ లోనే తనకి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం లభిస్తుంది. అయితే బాలీవుడ్ కి వెళ్లిపోయిన తర్వాత సొంతంగా నిర్మాణ సంస్థ సైతం స్థాపించింది తాప్సి. అందులో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తోంది. అలాగే బాలీవుడ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ టాలీవుడ్ సినీ సెలబ్రిటీస్ తో ఎప్పుడు కలిసిమెలిసి తిరుగుతూ ఉంటుంది ఈ బ్యూటీ. అక్కడ స్థిరపడాలి అని కేవలం బాలీవుడ్

 లోనే సినిమాలు చేస్తోంది. దాదాపుగా నాలుగు ఐదు ఏళ్లగా అక్కడే వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే గత ఏడాది ఒకే ఒక్క సినిమాతో మెప్పించిన తాప్సి ఈ ఏడాది మాత్రం ఒకేసారి వరుసగా నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాలు కాకుండా మరికొన్ని సినిమాలను లైన్లో పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సినిమాల షూటింగ్ సైతం జరుగుతున్నట్లుగా సమాచారం. అయితే ఇటీవల తాను కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఏంటంటే.. `నా మనస్తత్వాన్ని ఉద్దేశించి ఎంతో మంది ఎగతాళి చేసారు. ఒకరిని చూసి మరోకరు కించపరిచే ప్రయత్నం చేసారు.

ఎన్నో విమర్శలు సైతం కావాలని చేసేవారు. కానీ అవేవి నా జీవితాన్ని ప్రభావితం చేయలేదు. అలా ఎందుకు జరిగిందంటే నేను ఎంచుకున్న సినిమాలే కారణం. తప్పోఒప్పో చాలా సినిమాలు చేసాను. వాటి ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. నన్ను పైకి తీసుకురావడంలో ఆ పాఠాలు గుణపాఠాలుగా మలుచుకున్నాను.. అంటూ చెప్పుకొచ్చింది దీంతో తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: