టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ వీఎన్‌ ఆదిత్య.. మనసంతా నువ్వే, శ్రీరామ్, నేనున్నాను వంటి ఫీల్ గుడ్ హిట్  చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన డైరెక్షన్‌లో సినిమా అంటే మంచి ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ, లేదంటే సందేశాత్మక చిత్రం అని ఆడియన్స్ భావిస్తూ ఉంటారు. ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా వీఎన్‌ ఆదిత్య గుర్తింపు తెచ్చుకున్నారు. విజయవంతమైన సినిమాలను డైరెక్ట్‌ చేస్తూ వచ్చిన వీఎన్‌ ఆదిత్య ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఆయన డైరెక్ట్ చేసిన మూవీస్ కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అతి త్వరలోనే వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో మరో కొత్త సినిమా రాబోతుంది.ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ అనే కొత్త నిర్మాణ సంస్థలో.. డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మాతగా.. వీఎన్‌ ఆదిత్య డైరెక్షన్‌లో కొత్త సినిమా రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జూలై 7, ఆదివారం నాడు..అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో లో లాకింట బంకేట్‌ హాల్‌లో నిర్మహించిన మీడియా సమావేశంలో కొత్త సినిమాపై టీం ప్రకటన చేశారు.


వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో వచ్చే ఈ కొత్త సినిమా నిర్మాణం డల్లాస్‌లో జరగనుందని.. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్తుందని మేకర్స్‌ తెలిపారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌.. ఆడిషన్స్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేవలం భారతీయులు మాత్రమే కాక.. విదేశీయులైన అమెరికన్స్‌, స్పానిష్‌ వాళ్ళు, ఆఫ్రికన్స్‌, యూరోపియన్స్‌, ఏషియన్స్‌, మన ఇండియన్స్‌లో మరీ ముఖ్యంగా తమిళ్‌, కన్నడ, తెలుగు వారు భారీ సంఖ్యలో ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతూ ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. దీనిపై దర్శకుడు వీఎన్‌ ఆదిత్య తన ఆనందం వ్యక్తం చేశారు.. ఫీల్‌ గుడ్‌ మూవీస్‌కు కెరాఫ్‌ అడ్రెస్‌ అయిన సీనియర్ డైరెక్టర్ వీఎన్‌ ఆదిత్య డైరెక్షన్‌లో సినిమా అంటే.. కచ్చితంగా  సున్నితమైన భావోద్వేగాలు ఉంటాయి. దేశం కాని దేశంలో ఓ తెలుగు సినిమా ఆడిషన్ కి ఇంతటి సూపర్ రెస్పాండ్ రావడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.మరి వీ.ఎన్. ఆదిత్య ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకి వస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: