జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణీత ది పెద్దల కుదిరిచిన వివాహం అన్న సంగతి అందరికీ తెలిసిందే.. ఇద్దరూ కూడా వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉంటూ చాలామంది సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. స్టార్ హీరో భార్య అయినప్పటికీ లక్ష్మీ ప్రణతి చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది లక్ష్మీ ప్రణతి. ఎన్టీఆర్ ,లక్ష్మీ ప్రణతికి ఇద్దరు సంతానం ఇద్దరు కూడా మగపిల్లలే.. తాజాగా లక్ష్మీ ప్రణతికి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.


అదేమిటంటే లక్ష్మీ ప్రణతి కి ఎన్టీఆర్ పై కోపం వస్తే ఏం చేస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. ఎన్టీఆర్ కి కోపం వస్తే.. కచ్చితంగా తనకు ఇష్టమైన ఫుడ్ ని చేసుకొని తిని వెళ్లిపోయి కోపం తగ్గిన తర్వాత మరి వస్తారట.. కానీ లక్ష్మీ ప్రణతి మాత్రం కోపం వస్తే కనుక ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాని పెట్టుకుని మరి చాలాసార్లు చూస్తుందట.. ఈ సినిమా చూసిన తర్వాత ఆమె కోపం మొత్తం తగ్గిపోతుందని తెలియజేసినట్టు సమాచారం.


ఎన్టీఆర్ ఆది సినిమా లో ఎంత కోపంగా చూపిస్తారో అంతే ప్రేమతో ఎమోషనల్ గా చూపిస్తూ ఉంటారు. అందుకే ఈ సినిమా చూస్తే తన కోపం మొత్తం తగ్గిపోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు. కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబానికి ఎక్కువ సమయాన్ని ఎన్టీఆర్ కేటాయిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పలు రకాలు వెకేషన్ కి కూడా కుటుంబంతో కలిసి వెళ్లిన సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాము. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తూ ఉన్నారు ఈ సినిమా అయిపోగానే బాలీవుడ్ లో వార్-2 చిత్రంలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: