రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం రోజు రోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తనను మోసం చేశాడు అంటూ లావణ్య పోలీసు ఫిర్యాదు చేయడంతో రాజ్ తరుణ్ కి సంబంధించిన ఒక్కొక్క యవ్వారాలు బయటపడుతున్నాయి. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడు అని వాపోతోంది లావణ్య. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి ఇప్పుడు వేరే అమ్మాయిలతో ఎఫైర్ నడుపుతున్నాడు అంటూ రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేస్తోంది. టాలీవుడ్ హీరోయిన్ మాల్వి మన్హోత్రాతో గత కొంతకాలంగా ఎఫైర్ నడుపుతున్నాడు అని అందుకే తనను దూరం చేస్తున్నాడు అని తనను

 బ్లాక్ చేశాడు అని ఆరోపిస్తోంది లావణ్య. ఇకపోతే రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ఇద్దరు కలిసి తిరగబడరా సామి అనే సినిమా చేశారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే లావణ్య రాజ్ తరుణ్ పై ఇలాంటి ఆరోపణలు చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. కాగా ఈ ఆరోపణలకు స్పందించిన రాజ్ తరుణ్.. లావణ్య అనే అమ్మాయితో రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే అని.. కాకపోతే ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉందని, అలాగే వేరే అబ్బాయితో ఆమె రిలేషన్ లో ఉందని రాజ్ తరుణ్ అన్నారు. మాల్వీ మల్హోత్రాతో రిలేషన్ లో ఉన్నానంటూ

 ఆమె చేసిన ఆరోపణల్లో నిజం లేదు అంటున్నారు ఈ హీరోగారు. కానీ లావణ్య మాత్రం రాజ్ తరుణ్ గురించి షాకింగ్ విషయాలు బయటపెడుతోంది. తాను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా మాట నిజమే కానీ తాను డ్రగ్స్ వాడలేదు అని అంటుంది లావణ్య. తాజాగా రాజ్ తరుణ్ కు బిగ్ బాస్ ఫెమ్ అరియానా గ్లోరీ కి కూడా ఎఫైర్ ఉందని ;అంటుంది రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య. మాల్వి మల్హోత్రతోనే కాదు మరికొంతమందితోనూ రాజ్ తరుణ్ కు ఎఫైర్ ఉందని తెలిపింది లావణ్య. ఈ క్రమంలోనే అరియానాతోనూ అతను ఎఫైర్ పెట్టుకున్నాడని.. అరియానా గ్లోరీతో ఒక్కరోజు మాత్రమే షూటింగ్‌కి వెళ్లాడు రాజ్ తరుణ్. నేను కోర్స్ నేర్చుకోవడానికి మూడు నెలలు గోవా వెళ్లాను ఆ టైం లో రాజ్ తరుణ్ అరియానాకు దగ్గరయ్యాడు. అంటూ రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేస్తుంది లావణ్య మరి వీళ్ళ వ్యవహారం ఇంకెంత ముందుకు సాగుతుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: