ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినిదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరి సూపర్ స్టార్స్ ఈ సినిమాలో నటించారు. దీపికా పడుకోన్, దిశా పటాని లాంటి హాట్ హీరోయిన్లు నటించారు. మహాభారతన్ని యాడ్ చేసి చూపించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఫస్ట్ షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకొని భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర  రూ. 900 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు మూవీ టీం అధికారికంగా తెలిపింది. అయితే కొంచెం లేట్ అయినా కూడా లేటెస్ట్ గా తనదైన రీతిలో కల్కిపై ప్రశంసలు కురిపించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా వచ్చిందంటే.. కచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ రివ్యూ ఎక్స్ లో ఉండాల్సిందే. ఎలాంటి ఇగో లేకుండా మహేష్ స్పందిస్తారు. అది ఆయన మంచితనం.


ఇక తాజాగా కల్కిని చూసిన మహేష్.. సినిమాపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ.. మూవీ టీంని పొగడ్తలతో ముంచెత్తాడు.” కల్కి2898 AD.. నా మనసును కదిలించింది.. జస్ట్ వావ్. నాగ్ అశ్విన్.. మీ భవిష్యత్ దృష్టికి హ్యాట్సాఫ్. ప్రతి ఫ్రేమ్ ఒక కళాఖండం. అమితాబ్ బచ్చన్ సార్.. మీ స్క్రీన్ ప్రజెన్స్ కు సరిరారు ఎవ్వరు. కమల్ హాసన్ సార్.. మీరు ఎంచుకొనే ప్రతి పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ప్రభాస్ మీరు మరో గొప్ప పనిని సులభంగా నిర్వహించారు. దీపికా ఎప్పటిలానే నువ్వు అద్భుతంగా చేసావు.ఇంత అద్భుతమైన విజయాన్ని అందుకున్నందుకు వైజయంతీ మూవీస్ మరియు చిత్రబృందానికి అభినందనలు” అంటూ ప్రశంసలు కురిపించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది. ఇక ఇన్నిరోజులు తరువాత కూడా సినిమా చూసి రివ్యూ ఇచ్చిన మహేష్ బాబుకు మూవీ టీం ఇంకా ప్రభాస్ అభిమానులు థాంక్స్ చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: