టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపుని తెచ్చుకొని ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కనుంది. ఇక దేవర పార్ట్ 1 అక్టోబర్ 10వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది.

ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, సినీ ఇండస్ట్రీలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా అందాల తార శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ ....హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2లో నటించనున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.


ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. అయితే గతంలో తారక్, శ్రీను వైట్ల కాంబినేషన్లో బాద్ షా సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అప్పటి స్టార్ నటుడు సిద్ధార్థ్ ఎన్టీఆర్ కు తమ్ముడి పాత్రలో నటించి మెప్పించారు. అయితే ఈ సినిమాలో మొదటగా సిద్ధార్థ్ ను కాకుండా వేరే హీరోను అనుకున్నారట. కానీ ఎన్టీఆర్ వద్దని చెప్పి పట్టుబట్టి మరి ఆ పాత్రలో సిద్ధార్థ్ ను పెట్టి సినిమా తీశారు. ఇక ఈ సినిమాలో జరిగే బాంబు పేలుళ్లలో భాగంగా సిద్ధార్థ్ మరణిస్తాడు.


ఇక ఆ సినిమాలో సిద్ధార్థ్ మరణించడంతో తనకు అప్పటి నుంచి సినిమా అవకాశాలు రావడం లేదని కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్ అలా పట్టుబట్టి మరి సిద్ధార్థ్ ని సినిమాలో నటించేలా చేశారు. ఆ సినిమాలో సిద్ధార్థ్ నటించకుండా ఉంటే తన కెరీర్ మరోలాగా ఉండేదని సిద్ధార్థ్ అభిమానులు అంటున్నారు. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: