గత కొన్ని ఏళ్లుగా సరైన హిట్ట లేక బాధపడుతున్నాడు సందీప్ కిషన్. 2021లో ఏఐ ఎక్స్ప్రెస్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సందీప్ కిషన్ ఆ తర్వాత గల్లీ రౌడీ మైఖేల్ ఊరు పేరు భైరవకోన వంటి సినిమాలు చేసినప్పటికీ సరైన  హిట్టు అందుకోలేకపోయాడు. ఇక ఆ తర్వాత తనకి హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో మళ్ళీ సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేయడానికి సందీప్ కిషన్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా సందీప్ కిషన్ ఒకసారి కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అది కూడా సినిమా కాదంట. ఒక వెబ్ సిరీస్ అని

 అంటున్నారు. రీసెంట్గా టిల్లు స్క్వేర్ తో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు మల్లి రామ్ దర్శకత్వంలో ఈ సిరీస్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ సిరీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . అల్లరి నరేష్ తో 'ఆ ఒక్కటి అడక్కు' సినిమాని నిర్మించిన రాజీవ్ చిలుక ఈ సిరీస్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారట. నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ గా ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ ముందుకు రాబోతుందని సమాచారం. గతంలో ఫ్యామిలీమెన్‌' వెబ్ సిరీస్‌లో సందీప్ కిషన్ నటించారు.అయితే అది ఫుల్ లెంగ్త్ రోల్ అయితే కాదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారు.  'ధమాకా'తో బ్లాక్ బస్టర్ ని అందుకున్న

 త్రినాథరావు నక్కిన, ప్రసన్న కుమార్ కాంబినేషన్ లో సందీప్ తన 30వ సినిమాని చేస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్న ఈ చిత్రం కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని సమాచారం. మరి గత మూడు నాలుగు సంవత్సరాల నుండి సరైన హిట్ లేక సతమతమవుతున్న సందీప్ కిషన్ కి ఈ డైరెక్టర్ అయినా సరేనా హిట్ ఇస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: