ఆసియా ఖండంలోనే అతిపెద్ద కోటీశ్వరుడైన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు గత కొద్దిరోజులుగా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ పెళ్లి వేడుకలకు చాలామంది బాలీవుడ్ తారలు ఈ పెళ్లి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. గుజరాతి సాంప్రదాయం ప్రకారం పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే చాలామంది సినీ సెలెబ్రిటీలో హాజరవుతున్న దారుణంలో జాహ్నవి కపూర్ సైతం ఈ వేడుకలకు వెళ్ళింది. పెళ్లి కావడంతో ట్రెడిషనల్ లుక్ లో అందరినీ మెస్మరైజ్ చేసింది జాన్వి కపూర్. ఆరెంజ్ కలర్ డిజైనర్ చోళీ లెహంగా దుపట్టా

 లో కనిపించింది. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించిన జాన్వీ కపూర్ ఒక అరుదైన హారం ధరించింది దీంతో ఆ హారంకి సంబంధించిన పలు  విషయాలు ధర ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే..  పెద్ద పెద్ద స్టోన్స్ తో కూడిన సదరు నెక్లెస్ హజారీలాల్ లీగసి జ్యువెలరీ బ్రాండ్ కి చెందినది. దాని ధర ఏకంగా రూ. 50 లక్షలు అట. జస్ట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు రూ. 50 లక్షల హారం ధరించిన జాన్వీ... పెళ్ళికి ఎంతటి ఖరీదైన బట్టలు, నగలు ధరిస్తుందో అనే చర్చ నడుస్తోంది. కాగా అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలకు జాన్వీ కపూర్ తన

 ప్రియుడు శిఖర్ పహారియాతో రావడం విశేషం.   మరోవైపు సౌత్ లో రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తుంది జాన్వీ కపూర్. ఎన్టీఆర్ కి జంటగా నటిస్తున్న దేవర చిత్రీకరణ చివరి దశలో ఉంది. సమ్మర్ కి విడుదల కావాల్సిన దేవర దసరాకు వాయిదా పడింది. అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయనున్నారు. దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓ కీలక రోల్ చేస్తున్నారు.  అలాగే రామ్ చరణ్ 16వ చిత్రానికి జాన్వీ కపూర్ సైన్ చేసింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: