టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో సుకుమార్ ఒకరు. ఈయన అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఆర్య మూవీతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. మొదటి మూవీ తోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ఈయనకు అద్భుతమైన క్రేజ్ ఈ సినిమాతో లభించింది. ఆ తర్వాత నుండి ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో ఒకటి , రెండు మూవీలు మినహాయిస్తే అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నయి. దానితో ప్రస్తుతం సుకుమార్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా కెరియర్ కొనసాగిస్తున్నాడు. ఇకపోతే సుకుమార్ సినిమా అంటే ఐటెం సాంగ్ ఆల్మోస్ట్ ఉంటుంది.

ఈయన దర్శకత్వంలో రూపొందిన నాన్నకు ప్రేమతో సినిమాలో మాత్రమే ఐటమ్ సాంగ్ లేదు. మిగతా అన్ని సినిమాల్లోనూ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సుకుమార్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇందులో అల్లు అర్జున్ హీరో గా నటించగా ... రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేసింది. సమంత చేసిన ఈ ఐటమ్ సాంగ్ కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. సుకుమార్ మొదట ఈ ఐటమ్ సాంగ్ లో సమంత ను కాకుండా ఆ సమయంలో ఫుల్ జోష్ లో ఉన్న కృతి శెట్టిని తీసుకోవాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఈ బ్యూటీ నీ కూడా సంప్రదించాడట.

కాకపోతే ఈమె కెరియర్ బిగినింగ్ లోనే అలాంటి పాటలు చేయడం ఇష్టం లేక ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఇక సమంతను అప్రోచ్ కాగా ఈమె ఒప్పుకున్న భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ సాంగ్ కోసం సమంత ఏకంగా 5 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు అనేక వార్తలు ఆ సమయంలో వచ్చాయి. ఇక కృతి శెట్టి కనుక ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఉంటే చాలా తక్కువ బడ్జెట్ లోనే అయి ఉండేది. సమంత కాబట్టి ఎక్కువ మొత్తం తీసుకుంది. అలా ఈ సినిమా బడ్జెట్ ను తగ్గించాలి అనుకున్న సుకుమార్ ప్లాన్ కృతి శెట్టి వల్ల వర్కౌట్ కాలేదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: