సీనియర్ హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శ్రీదేవి ఎన్నో సినిమాల్లో చేస్తూ ప్రేక్షకుల్ని బాగా కట్టుకుంది. శ్రీదేవికి ఇద్దరూ కూతుర్లు. వాళ్లే జాన్వి కపూర్, ఖుషి కపూర్. తన ,అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నది. ఇక దివంగత శ్రీదేవి, బోనీకపూర్ జంటకు ఇద్దరూ కూతుర్లు జాన్వి కపూర్, ఖుషి కపూర్ ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయం. వీరిద్దరే కాకుండా శ్రీదేవికి మరో కుమార్తె కూడా ఉందని మీకు తెలుసా!..అసలు ఈ మూడో కూతురు ఎవరు..? శ్రీదేవి జీవితంలోకి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.


శ్రీదేవి నటించిన చివరి మూవీ 'మామ్' అందరికీ తెలిసింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా, మూవీలో తన కూతురిగా నటించిన సజల్ అలీ గురించి శ్రీదేవి కొన్ని విషయాలు చెప్పింది. మూవీ షూటింగ్ సమయంలో ఆమెతో ఏర్పడిన బాండింగ్ గురించి మాట్లాడుతూ..సజల్ తల్లి అకస్మీక మరణం తనను తీవ్రంగా కాల్చి వేసిందని..సజల్ నాకు మూడో సంతానం లాంటిదని, ఇప్పుడు నాకు మరో కూతురు ఉన్నట్లు భావిస్తున్నానని శ్రీదేవి ఆ సమయంలో చెప్పింది. ఇక శ్రీదేవి మరణాంతరం సజల్ అలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..శ్రీదేవి గారు నాకు తల్లి లాంటిది. ప్రస్తుతం నేను షాక్ లో ఉన్నాను.


మళ్లీ నా తల్లిని కోల్పోయినట్లు అనిపిస్తుందని చెప్పింది సజల్. నేను దుబాయ్ లో జరిగిన 'మసాలా' అవార్డ్ ఫంక్షన్ కు హాజరు కాకపోయినా..ఆ సమయంలో శ్రీదేవి, 'ఐ మిస్ట్ యూ బేటా' అని టెక్ట్స్ మెసేజ్ పంపిందని సజల్ గుర్తుచేసుకుంది. ఆమె నుంచి నాకు వచ్చిన చివరి మెసేజ్ ఇదే. గత రెండు నెలల్లో మేము చాలా సార్లు మాట్లాడుకున్నాం. కొన్ని రోజుల క్రితం ఆమె నాకు ఫోన్ చేసింది. కానీ అప్పుడు నేను షూటింగ్ లో ఉంది కాల్ మిస్ అయ్యాను. నేను ఆమెకు తిరిగి కాల్ చేయాలని అనుకుంటూనే ఉన్నాను, కానీ చాలా సమయం తీసుకున్నాను, అప్పుడుకే చాలా లేట్ అయిపోయింది అని సజల్ శ్రీదేవి మృతి పై విచారం వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: