పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా కల్కి. ఇక ఈ సినిమా విడుదలై 11 రోజులు అవుతుంది కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం దుమ్ము దులుపుతోంది. విడుదలై 11 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు 900 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది.  కల్కి 2898 ఏడీలో ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన, దిశా పటానీ, అన్నా బెన్, పశుపతి, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ మరియు పలువురు ప్రముఖ పాత్రలు పోషించారు. అగ్ర నిర్మాత అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. బౌంటీ ఫైటర్‌

 భైరవగా కనిపించిన ప్రభాస్‌.. చివరిలో కర్ణుడిగా కనిపించి పార్ట్‌ 2పై అంచనాలు పెంచేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల నుండే కల్కి రన్ టైం విషయంలో కొంత విమర్శలు ఉండేవి. అయితే తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. తనకు ఎంత టైం ఉన్నా ఎడిటింగ్ చేసేందుకు సరిపోదు అని అన్నారు. సినిమా కోసం పడిన కష్టమంతా దాని ఫలితం చూసాక మరిచిపోయాను అని.. అన్ని ప్రాంతాల నుండి దీనికి విశేష స్పందన వస్తుంది అని.. దీని ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అంటూ వెల్లడించాడు .చిన్న చిన్న ప్రాంతాల్లో సైతం కల్కి భారీ విజయాన్ని సాధించింది అని.. ఇలాంటి

 సినిమాల కోసం నాకు మరో నెల సమయం ఇచ్చినా కూడా సరిపోదు అని.. ఇంకాస్త సమయం ఉంటే చాలా బాగుండేది అని కొందరు దీని రన్ టైం గురించి ట్రోల్స్ చేశారు అని అన్నారు. కానీ నేను మాత్రం విమర్శలను కూడా చాలా పాజిటివ్ గా తీసుకుంటాను.. ఎందుకంటే వాటిలో కూడా మనకు తెలియని పాయింట్లు చాలా ఉంటాయి. ఇది మొదటి భాగం మాత్రమే ఇందులో అన్ని పాత్రలను పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే రన్ టైం ఎక్కువ అయింది అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు కొందరు మాత్రం ఈ సినిమాను నేను మొదట చేసిన మహానటి సినిమాతో పోలుస్తున్నారు. ఆ సినిమాకి  ఈ సినిమాకి చాలా తేడా ఉంది. రెండు కథలు చాలా డిఫరెంట్ అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: